TS News: లాక్డౌన్ తొలగింపు?
రాష్ట్రంలో లాక్డౌన్కు ముగింపు పలకాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. జన సమ్మర్థం, రద్దీపై ఆంక్షలు కొనసాగించేందుకు యోచిస్తోంది. థియేటర్లు, పబ్బులు, క్లబ్బులు, బార్లు వంటి
రాకపోకలు యథాతథం
జనసమ్మర్దంపై ఆంక్షలు
నేడు మంత్రిమండలి అత్యవసర సమావేశంలో నిర్ణయించే అవకాశం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్కు ముగింపు పలకాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. జన సమ్మర్థం, రద్దీపై ఆంక్షలు కొనసాగించేందుకు యోచిస్తోంది. థియేటర్లు, పబ్బులు, క్లబ్బులు, బార్లు వంటి వాటి మూసివేత కొనసాగనుంది. వివాహాలు, అంత్యక్రియల లాంటి వాటిపై పాత నిబంధనలు అమలు చేయనుంది. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో లాక్డౌన్తో పాటు ఇతర కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ గడువు శనివారంతో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో దానిపై నిర్ణయం తీసుకునే ప్రధాన ఎజెండాపై మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు వీలుగా మంత్రిమండలి సమావేశం జరపాలని సీఎం నిర్ణయించారు. మంత్రులందరికీ ఆయన స్వయంగా ఫోన్ చేసి సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానించారు. అందుబాటులో ఉన్న మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్ తదితరులతో సీఎం శుక్రవారం ప్రగతిభవన్లో సమావేశమయ్యారు. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులకు అత్యవసర సమాచారం ఇచ్చారు. ప్రాథమికంగా కొన్ని అంశాలతో ఎజెండాను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతుండడంపై వైద్య ఆరోగ్యశాఖ నివేదిక రూపొందించినట్లు తెలిసింది. మూడో దశ గురించి ఉన్న భయాందోళనలపైనా సీఎం వైద్య ఆరోగ్యశాఖ నుంచి స్పష్టత కోరారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో లాక్డౌన్ మినహాయింపునకే ప్రభుత్వం మొగ్గుచూపే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మాస్క్ల ధారణ వంటి కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్సీ ఎంపికపై...
రాష్ట్రంలో ఈ నెల 16న గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి పదవీ విరమణతో ఆ స్థానం ఖాళీ అయింది. అప్పటికే ఖాళీ అయిన ఎమ్మెల్యేల కోటా ఆరు స్థానాలతో కలిపి దీనిని భర్తీ చేయాలని మొదట ప్రభుత్వం భావించింది. ఏపీలో నామినేటెడ్ ఎమ్మెల్సీల నియామకం జరగడంతో.. ఇక్కడా వెంటనే భర్తీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనిని టేబుల్ ఎజెండాలో చేరుస్తున్నట్లు సమాచారం.
కల్తీ విత్తనాలపై ఉక్కుపాదం
రాష్ట్రంలో వ్యవసాయ సీజన్లో ఇబ్బందులు లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం ఇప్పటికే ఆదేశించారు. పోలీసు, వ్యవసాయ శాఖలను అప్రమత్తం చేయడంతో అవి విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ నకిలీ విత్తనాలను పెద్దఎత్తున స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నకిలీ విత్తనాలపై మరింత కట్టడికి మంత్రిమండలిలో నిర్ణయం తీసుకోనున్నారు.
ఏపీ ప్రాజెక్టులపై...
ఏపీ ప్రభుత్వం కృష్ణానదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, మంత్రులు సీఎంకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సీఎం మంత్రులు, నీటిపారుదల శాఖ అధికారుల నుంచి తీసుకున్నారు. అక్రమ ప్రాజెక్టులపై కఠిన వైఖరిని అవలంబించాలనే అభిప్రాయం ఈ సందర్భంగా వ్యక్తమైంది. మంత్రిమండలిలో దీనిపై సమగ్ర చర్చ జరగనుంది.
హుజూరాబాద్పై...
మంత్రిమండలి అధికారిక ఎజెండా అనంతరం మంత్రులతో సీఎం రాజకీయపరమైన అంశంపై చర్చించనున్నట్లు తెలిసింది. ప్రధానంగా హుజూరాబాద్ ఉప ఎన్నికల సమగ్ర ప్రణాళిక రూపకల్పనపై అందరి అభిప్రాయాలు సీఎం తీసుకోనున్నారని తెలుస్తోంది. నియోజకవర్గంలోని ఏడు మండలాలు, రెండు పురపాలికలకు ఇన్ఛార్జీల నియామకం, పర్యటనలు, ఇతరత్రా వ్యూహాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు. -
భూసార పరీక్ష కేంద్రాల పునరుద్ధరణ
రాష్ట్రంలో మూతపడిన 25 భూసార పరీక్ష కేంద్రాలను పునరుద్ధరించాలని, నేల పోషక విలువలు, ఆరోగ్య సమాచార సేవలను రైతులకు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
శ్రీరాముడి పట్టాభిషేకం.. పులకించిన భక్తజనం
శ్రీరాముడి మహాపట్టాభిషేక మహోత్సవంతో భద్రగిరి దివ్యక్షేత్రం గురువారం పులకించింది. సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు సీతమ్మతో కలిసి భక్తకోటికి రాజాధిరాజుగా సాక్షాత్కరించాడు. -
కృష్ణా జలాల విడుదలకు కేఆర్ఎంబీ ఉత్తర్వులు
కృష్ణా జలాల విడుదలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. మే నెలాఖరు వరకు నాగార్జునసాగర్ నుంచి రెండు రాష్ట్రాలు 14 టీఎంసీలు వినియోగించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. -
‘గ్రేటర్’ విద్యుత్ డిమాండ్!
హడలెత్తిస్తున్న ఎండలు.. భరించలేని ఉక్కపోతతో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో విద్యుత్ వినియోగం అమాంతం పెరుగుతోంది. -
అభిషేక్ బోయిన్పల్లి మధ్యంతర బెయిల్ మే 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాద్ వ్యాపారి అభిషేక్ బోయిన్పల్లికి ఈనెల 29వ తేదీ వరకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు మే 8 వరకు పొడిగించింది. -
జపాన్లో భారత విద్యార్థులకు ఉపకార వేతనాలు
జపాన్లోని జాతీయ విశ్వవిద్యాలయాల్లో 2025లో ప్రవేశాలు పొందే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు తమ దేశ ప్రభుత్వం విద్యా, సాంస్కృతిక, క్రీడ, శాస్త్ర, సాంకేతిక శాఖ(మెక్స్ట్) ద్వారా ఉపకారవేతనాలు ఇస్తుందని చెన్నైలోని జపాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం గురువారం వెల్లడించింది. -
మహాత్మాగాంధీ సిద్ధాంతాలు ప్రపంచానికి ఆదర్శం
జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలు, అహింసా సిద్ధాంతం ప్రపంచానికి ఆదర్శనీయమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ పేర్కొన్నారు. -
మళ్లీ వరికే పెద్దపీట
రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలం సీజన్లో రైతులు వరి, పత్తి సాగుకు పెద్దపీట వేయనున్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. -
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్తో అప్రమత్తం
మావోయిస్టులను దెబ్బతీసేందుకు ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ప్రయత్నాలు తెలంగాణపైనా ప్రభావం చూపుతున్నాయి. -
చెరువుల పరిరక్షణకు.. చర్యలేమిటో చెప్పండి!
కబ్జాలతో కుచించుకుపోతున్న చెరువులు, కుంటల పరిరక్షణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ హెచ్ఎండీయేతోపాటు పలు ప్రభుత్వ శాఖలకు గురువారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
ఆరుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు
మల్టీజోన్-1 పరిధిలో ఆరుగురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేస్తూ ఐజీ ఎ.వి.రంగనాథ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్