Fake News: చూడగానే నమ్మకండి!
పాత తరానికి చెందిన ప్రముఖ నటి తీవ్ర అస్వస్థతతో కన్నుమూత. ధ్రువీకరించిన వైద్యులు ఫేస్బుక్, వాట్సప్ సహా సామాజిక మాధ్యమాల్లో ఇటీవల వచ్చిన వార్త ఇది.
సామాజిక మాధ్యమాల్లో అసత్యాల ప్రచారం
మొబైల్యాప్లతో నమ్మించేలా వక్రీకరణ
వ్యక్తులు, సంస్థలపై తీవ్ర ప్రభావం
సుమోటోగా పోలీసుల దర్యాప్తు
ఈనాడు - హైదరాబాద్
పాత తరానికి చెందిన ప్రముఖ నటి తీవ్ర అస్వస్థతతో కన్నుమూత. ధ్రువీకరించిన వైద్యులు.. ఫేస్బుక్, వాట్సప్ సహా సామాజిక మాధ్యమాల్లో ఇటీవల వచ్చిన వార్త ఇది. ఒక ఛానల్లో ప్రసారమైందంటూ గుర్తుతెలియని వ్యక్తులు దానిని వాట్సప్ బృందాలకు పంపించారు. అది నిమిషాల్లో వేలమందికి చేరింది. సినీ ప్రముఖులు, పత్రికా విలేకరులు ఆరా తీస్తే తాను బతికే ఉన్నానని ఆమె స్వయంగా ప్రకటించారు.
ఆ చిత్రం చూస్తే అచ్చం టీవీలో వచ్చినట్లే ఉంటుంది. అందులోని విషయం అందరూ నమ్మేలా ఉంటుంది. అది ప్రముఖుల మరణ వార్త కావొచ్చు. ప్రమాద సమాచారం కావొచ్చు. అది కొందరిని ఆందోళనకు గురిచేస్తుంది. మరికొందరిని అయోమయంలోకి నెట్టేస్తుంది. వ్యక్తులపైనే కాదు సంస్థలపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. అది నిజమేనా అని నిర్ధారించుకునేలోగానే అది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టి చేయాల్సిన నష్టం చేసేస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా వార్తలు క్రమంగా పెరుగుతున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. మొబైల్ యాప్స్ సహాయంతో సైబర్ నేరగాళ్లు ఇలాంటి బోగస్ వార్తలు సృష్టించి జనంలోకి వదులుతున్నారని తెలిపారు. హైదరాబాద్లో ఇలాంటివారిని 10 నెలల్లో 15 మందిని అరెస్ట్ చేశామన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఏ వార్తనూ వెంటనే నమ్మవద్దని, విశ్వసనీయ వార్తా సంస్థల వెబ్సైట్లను, ఛానళ్లను పరిశీలించి నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు.
ఇలా తెలుస్తుంది..
ఏదైనా వార్త, వీడియో నకిలీదని, అసత్యమైందని అనుమానం వచ్చిన వెంటనే సామాజిక మాధ్యమాల పరిశోధన, అభివృద్ధి విభాగం వెంటనే ఫ్యాక్ట్చెక్ పేరుతో ఆ వార్త, వీడియో నకిలీదని, దాని మూలం ఫలానాచోట ఉందని వివరిస్తుంది.
గూగుల్: వార్తలు, వీడియోలు, కార్టూన్లు, ఫొటోలను రివర్స్ ఇమేజ్, సెర్చింగ్ ద్వారా క్షణాల్లో ఆయా వార్తలు, వీడియోలు, ఫొటోల వివరాలను తెలుపుతుంది. అభ్యంతరాలపై వేగంగా నిర్ణయం తీసుకుంటుంది.
ట్విటర్: వివాదాస్పద ప్రకటనలు, మాటలు, చేష్టలు, వీడియోలను ఎవరైనా పోస్ట్ చేస్తే చాలా సందర్భాల్లో ట్విటర్ ప్రతినిధులు స్వయంగా తొలగించడంతో పాటు ఆ హ్యాండిల్పై నిషేధం విధిస్తున్నారు.
ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్: బాధితులు, వ్యక్తులు, పోలీసులు ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే తొలగిస్తున్నాయి.
యూట్యూబ్: తాను అనుమతించిన కొన్ని ఛానళ్లలో అసభ్య కథనాలు, ఫొటోలు, రాజకీయ వార్తల వీడియోలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. వెంటనే తొలగించడంతోపాటు ఎవరైనా ఫిర్యాదు చేస్తే, ఎవరు అప్లోడ్ చేశారన్న సమాచారాన్ని ఇస్తోంది.
స్వయంగా వీక్షిస్తున్న సైబర్క్రైమ్ పోలీసులు
నెటిజన్ల నుంచి అందుతున్న సమాచారం, సామాజిక మాధ్యమాలను స్వయంగా వీక్షించడం ద్వారా పోలీసులు అసత్య వార్తలు, కథనాల రూపకర్తలను పట్టుకుంటున్నారు. వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాల ప్రతిష్ఠకు భంగం కలిగేలా వార్తలు, కథనాలపై సైబర్ క్రైమ్ పోలీసులు ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారని సంయుక్త కమిషనర్ (నేర పరిశోధన) అవినాష్ మహంతి వివరించారు. ప్రచారంతో పరువుకు భంగం కలిగిన వారు 9490616555 నంబరుకు వాట్సప్ చేయాలని తెలిపారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చని సూచించారు.
మొబైల్ యాప్ల మాయాజాలం
* అసత్య కథనాలు, వార్తలను సైబర్ నేరగాళ్లు కొన్ని మొబైల్ యాప్లతో సృష్టిస్తున్నారు. టీవీ ఛానళ్లలో వచ్చే వార్తలను ఫొటోలు తీసి, వివాదాస్పదంగా మార్చి ప్రచారం చేస్తున్నారు.
* జేఎన్టీయూ ఇంజినీరింగ్ పరీక్షలను వాయిదా వేయనందుకు నిరసనగా సునీత అనే ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందంటూ వాట్సప్లో కథనాలొచ్చాయి. ట్విటర్లో మంత్రులు కేటీఆర్, సబితారెడ్డికి ట్యాగ్ చేసినట్టూ ఉంది. సునీత అంటూ పోస్ట్ చేసిన ఫొటో మరో యువతిది. ఆమె ఇంజినీరింగ్ చదవలేదని తేలింది.
* అసత్య వార్తలు, కథనాలను రూపొందిస్తున్న నిందితులు పోలీసులకు దొరక్కుండా ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నారు. అమెరికా, ఐరోపా దేశాల్లో అసత్య వార్తలు, కథనాలు 70 శాతం ఉన్నాయని అక్కడి సైబర్ భద్రత విభాగం అధికారులు గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్కు ఎంతో సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ