KCR: 18న మహాధర్నా
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని నేను అడుగుతున్నా.. రైతులు, తెరాస నిన్ను నిలదీస్తే తప్పేంటి? అడిగితే నువ్వు దాడులు చేస్తున్నవ్.. రాళ్లతో కొట్టిస్తున్నవ్. ఇదంతా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మొన్న బాధ్యతారాహిత్యంగా యాసంగిలో వరి వేయమన్నది నిజమా? కాదా? ఒకవేళ నువ్వు తప్పు చెబితే రైతులకు క్షమాపణ చెప్పాలి. నీకు నిజాయతీ ఉంటే..
నాతో సహా మంత్రులు, తెరాస ప్రజాప్రతినిధులందరం పాల్గొంటాం
ధాన్యం సేకరణపై స్పష్టతకు ప్రధానికి లేఖ
రెండు రోజులు గడువిస్తాం.. స్పందించకుంటే వెంటాడి వేటాడతాం
రైతుల్ని గోస పెట్టిన భాజపాకు శిక్ష తప్పదు
నల్లచట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం
ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి
యాసంగిలో వరి వేయొద్దని రైతులకు విజ్ఞప్తి
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని నేను అడుగుతున్నా.. రైతులు, తెరాస నిన్ను నిలదీస్తే తప్పేంటి? అడిగితే నువ్వు దాడులు చేస్తున్నవ్.. రాళ్లతో కొట్టిస్తున్నవ్. ఇదంతా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మొన్న బాధ్యతారాహిత్యంగా యాసంగిలో వరి వేయమన్నది నిజమా? కాదా? ఒకవేళ నువ్వు తప్పు చెబితే రైతులకు క్షమాపణ చెప్పాలి. నీకు నిజాయతీ ఉంటే.. వరి వేయకండి అని చెప్పాలి. వర్షాకాలంలో వచ్చే ధాన్యాన్ని కేంద్రం సేకరిస్తుందో లేదో స్పష్టం చేయాలి.
- సీఎం కేసీఆర్
ఈనాడు, హైదరాబాద్: ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 18న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ తెలిపారు. ఆరోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు జరిగే ఈ ధర్నాలో తనతో సహా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ ఛైర్పర్సన్లు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు పాల్గొంటారని తెలిపారు. అనంతరం గవర్నరుకు వినతిపత్రం సమర్పిస్తామన్నారు. ధాన్యంపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని, సంవత్సరానికి ఎఫ్సీఐ సేకరణ లక్ష్యమేంటో రెండు, మూడు రోజుల్లో చెప్పాలని డిమాండ్ చేస్తూ బుధవారం ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాస్తామన్నారు. తమకు వెంటనే సమాధానం కావాలన్నారు. రైతులను ఆగం చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టంచేశారు. వరిసాగుకు గడువు సమీపిస్తోందని, ఈనెల 18 తర్వాత రెండురోజుల్లో కేంద్రం నుంచి స్పందన లేకుంటే వెంటాడి, వేటాడతామన్నారు. రైతులను గోస పెట్టినందుకు భాజపాకు శిక్ష తప్పదని చెప్పారు. తెలంగాణలో వానాకాలం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, యాసంగి పంటలకు రైతుబంధు డబ్బులు త్వరలోనే ఇస్తామని చెప్పారు. ఈ దుర్మార్గుల్ని నమ్మితే నష్టపోయే ప్రమాదం ఉన్నందున యాసంగిలో వరి వేయొద్దని రైతులకు విజ్ఞప్తిచేశారు. కేంద్రం నుంచి స్పందన లేకపోతే ఆందోళనలను కొనసాగిస్తూనే ఈ నెల 20 వరకు చూసి ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు సూచనలు ఇస్తామని తెలిపారు. మంగళవారం తెరాస శాసనసభాపక్ష సమావేశం అనంతరం మంత్రులు, తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సీఎం కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు.
‘వరి ధాన్యంపై భాజపా, కేంద్రం వైఖరి.. ముక్కు ఎక్కడ అంటే చుట్టూ తిప్పి చూపించినట్టు ఉంది’
అని తన వేలును ముక్కుపై పెట్టుకుని తల చుట్టూ తిప్పి చూపిస్తున్న కేసీఆర్
చేతులెత్తేసిన కేంద్రం
‘‘ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేతులెత్తేసింది. రైతు ప్రయోజనాలు కాపాడే ఉద్దేశం దానికి లేదు. గత సీజనుకు సంబంధించిన 20 లక్షల టన్నుల ధాన్యం కేంద్రం తీసుకోక గోదాముల్లో మూలుగుతోంది. 62 లక్షల ఎకరాల్లో పంట ఉందని చెప్పినా ఎటూ తేల్చడంలేదు. రాష్ట్రం కొనే పరిస్థితి లేదు. దేశంలో ఏ ఒక్క రాష్ట్రానికీ ధాన్యం నిల్వ చేసే పరిస్థితి ఉండదు. ధాన్యాన్ని కొనడం, దేశ అసరాల కోసం బఫర్ స్టాక్ నిర్వహించడం కేంద్రం బాధ్యత. కేంద్రం పంజాబ్లో వడ్లు మొత్తం కొంటోంది. మన దగ్గర మాత్రం కొనడం లేదు. దిల్లీ వెళ్లి కేంద్ర వ్యవసాయ మంత్రిని కలిసి మీ పద్ధతి బాగాలేదని చెప్పా. మా రాష్ట్రం నుంచి ఎంత ధాన్యం కొంటారో ఏడాది ముందే చెప్పమన్నాం. దీనిపై స్పష్టత వచ్చే వరకూ నేను ఇక్కడే ఉంటానన్నా. ఐదారు రోజుల్లో మంత్రివర్గ ఉపసంఘంతో మాట్లాడి చెబుతామన్నారు. ఇప్పటి వరకూ ఉలూకూ పలుకూ లేదు.
రైతులపై దాడులను సహించం
వానాకాలం పంటల కొనుగోలుకు 6,600కు పైగా కేంద్రాలు ప్రారంభించాం. భాజపా అక్కడికి వెళ్లి నాటకాలు మొదలుపెట్టింది. వరి వేయాలో వద్దో చెప్పకుండా, అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. రైతులు నిరసన వ్యక్తం చేస్తుంటే రాళ్లతో దాడులు చేస్తున్నారు. రైతులపై దాడులను సహించం. సంవత్సరం కాలంగా దిల్లీలో ధర్నాలు చేస్తే, వారిపై కార్లు ఎక్కించి చంపుతున్నారు. ప్రశ్నిస్తే దేశద్రోహులు అంటున్నారు. మా ధాన్యం కొంటారా లేదా అని సూటిగా అడుతుంటే సమాధానం చెప్పకుండా రాజకీయం చేస్తున్నారు. పిచ్చి మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం ఊరుకోదు. తెరాసకు 60 లక్షల మంది సభ్యులు న్నారు. వారిలో కొన్ని లక్షలమంది రైతులు. వారు నిలదీస్తుంటే రాళ్లతో కొడుతున్నారు. దీన్ని చాలా తీవ్రంగా తీసుకుంటున్నం. రైతులపై దాడి చేసిన వారిపై కేసులు పెడతారు. వారికి తగిన శిక్ష పడుతుంది. కేంద్రం తెచ్చిన విద్యుత్ చట్టాలను వద్దన్నాం. సాగు చట్టాలను వ్యతిరేకించాం. వచ్చే శాసనసభ సమావేశాల్లో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తాం’’ అని కేసీఆర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం