MLC Elections: 12 స్థానాలకు 102 నామినేషన్లు
రాష్ట్రంలోని తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు మొత్తం 102 నామినేషన్లు దాఖలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లను తెరాస మద్దతుదారులు
ఆదిలాబాద్లో ఒకే స్థానానికి 24 మంది నామినేషన్లు
నిజామాబాద్లో ఇద్దరే..
కరీంనగర్లో స్వతంత్రుడిగా తెరాస మాజీ మేయర్
మెదక్, ఖమ్మం బరిలో కాంగ్రెస్
రంగారెడ్డిలో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ పత్రాల చించివేతతో ఉద్రిక్తత
రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ పత్రాలు చించివేస్తున్న వ్యక్తి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు మొత్తం 102 నామినేషన్లు దాఖలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లను తెరాస మద్దతుదారులు చించివేయడంతో రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. నామినేషన్ల గడువు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. తెరాస అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ మెదక్, ఖమ్మంలలో తన అభ్యర్థులను నిలిపింది. కరీంనగర్ మాజీ మేయర్, తెరాస నేత రవీందర్సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. బుధవారం నామినేషన్ల పరిశీలన జరగనుండగా.. 26 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. డిసెంబరు 10న ఎన్నికలు జరగనున్నాయి. 14న ఫలితాలు వెల్లడిస్తారు.
* నిజామాబాద్లో తెరాస అభ్యర్థినిగా ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ నామినేషన్ వేయగా.. అందులో ‘మద్దతు సంతకాలు’ తమవి కావని ఇద్దరు ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో వివాదం ఏర్పడింది.
* గారెడ్డి జిల్లాలో 2 స్థానాలకు తెరాస అభ్యర్థులుగా ప్రస్తుత ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, పట్నం మహేందర్రెడ్డి నామినేషన్ వేశారు. మరో స్వతంత్ర అభ్యర్థి సైతం దాఖలు చేశారు.
* రీంనగర్లో రెండు స్థానాలకు 27 మంది నామినేషన్లు వేశారు. తెరాస అభ్యర్థులుగా ప్రస్తుత ఎమ్మెల్సీ టి.భానుప్రసాద్రావు, మాజీ మంత్రి ఎల్.రమణ బరిలో నిలిచారు. తనకు కీలక పదవి ఇవ్వలేదని అసంతృప్తితో ఉన్న మాజీ మేయర్ రవీందర్సింగ్ అధిష్ఠానం ఆదేశాలను ధిక్కరించి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మరో 24 మంది స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు.
* హబూబ్నగర్లో 2 స్థానాలకు 10 మంది నామినేషన్లు వేశారు. తెరాస అభ్యర్థులుగా ప్రస్తుత ఎమ్మెల్సీలు కూచికుళ్ల దామోదర్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మరో ఎనిమిది మంది స్వతంత్రులు నామినేషన్లు దాఖలుచేశారు.
* మ్మంలో ఒక స్థానానికి తెరాస అభ్యర్థిగా తాతా మధుసూదన్, కాంగ్రెస్ తరఫున రాయల నాగేశ్వరరావులతో పాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
* మెదక్లో ఒక స్థానానికి ఏడుగురు నామినేషన్లు వేశారు. వీరిలో తెరాస అభ్యర్థిగా డాక్టర్ యాదవరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థినిగా సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భార్య నిర్మలతో పాటు అయిదుగురు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.
* నల్గొండ జిల్లాలో ఒక స్థానానికి 11 మంది నామినేషన్లు వేశారు. తెరాస అభ్యర్థిగా ఎంసీ కోటిరెడ్డితో పాటు మరో 10 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
* వరంగల్లో ఒక స్థానానికి 14 నామినేషన్లు దాఖలయ్యాయి. తెరాస అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మరో 13 మంది స్వతంత్ర అభ్యర్థులు ఈ జాబితాలో ఉన్నారు.
* ఆదిలాబాద్ జిల్లాలో ఒక స్థానానికి 24 నామినేషన్లు దాఖలయ్యాయి. వీరిలో తెరాస అభ్యర్థిగా దండె విఠల్, మరో 23 మంది స్వతంత్రులు ఉన్నారు.
మూడోసారి నామినేషన్ దాఖలుకు వెళ్తున్న స్వతంత్ర అభ్యర్థి శైలజ చేతిలో పత్రాలను లాక్కునేందుకు
యత్నిస్తున్న వ్యక్తిని నిలువరిస్తున్న పోలీసులు
అఫిడవిట్లో కవిత కుటుంబ ఆస్తులు..
ఈనాడు, నిజామాబాద్: తన పేరుపై రూ.14.78 కోట్లు, భర్త పేరిట రూ.14 కోట్లు, ఇద్దరు పిల్లల పేర్లపై రూ.8.90 లక్షల చరాస్తులున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆమె పేరుపై రూ.9.30 కోట్లు, భర్త పేరిట రూ.9.39 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు పొందుపరిచారు. దంపతులిద్దరి పేరిట రూ.21.62 కోట్ల అప్పులు ఉన్నట్లుగా చూపారు. ఉద్యమ సమయంలో రెండు కేసులు నమోదైనట్లు ప్రస్తావించారు.
రంగారెడ్డిలో ఘర్షణ..
స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ పత్రాలను తెరాస మద్దతుదారులు చించివేయడంతో రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. మంగళవారం ఉదయం తెరాస అభ్యర్థులు పట్నం మహేందర్రెడ్డి, శంభీపూర్ రాజు తమ అనుచరులతో కలిసి వచ్చి నామినేషన్లు వేశారు. వారికి మద్దతుగా వెంట వచ్చిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున కలెక్టరేట్ గేటు వద్దే వేచి ఉన్నారు. అదే సమయంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి భార్య, రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు చింపుల శైలజ కలెక్టరేట్కు వచ్చారు. వారిని అక్కడున్న నాయకులు అడ్డుకుని నామినేషన్ పత్రాలు లాక్కొని చించివేశారు. అలా మూడుసార్లు జరగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో తన కుమారుడు అశ్విన్రెడ్డిపై, ప్రపోజర్స్పైనా దాడి జరిగిందని సత్యనారాయణరెడ్డి వాపోయారు. పోలీసులు లాఠీఛార్జీ చేసి పరిస్థితిని అదుపు చేశారు. ఈ ఘటనపై శైలజ సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధుల ఫోన్లను పట్నం మహేందర్రెడ్డి పీఏ మల్లారెడ్డి లాక్కోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు
రాష్ట్రంలో 2024 వానాకాలం సీజన్ కోసం 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. -
నీటి లోతుల్లో నిఘా కళ్లు!
-
కృష్ణా పరీవాహకంలో చెరువుల కింద నీటి వినియోగం ఎంత?
చిన్ననీటి పారుదల రంగంలో కృష్ణా పరీవాహకంలో నీటి వినియోగం, పొదుపుపై నీటిపారుదల శాఖ లెక్కగడుతోంది. -
గురుకుల విద్యార్థి మృతి ఘటనపై కేంద్రం ఆగ్రహం
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ను ఆదేశించింది. -
శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలు
శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలున్నాయి. దక్షిణ భారత్లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
పాలిటెక్నిక్ లెక్చరర్స్ జీఆర్ఎల్ వెల్లడి
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను (జీఆర్ఎల్) టీఎస్పీఎస్సీ ప్రకటించింది. -
డీఎంఈ పరిధిలోని.. 16,024 మంది సిబ్బంది సేవల పొడిగింపు
వైద్య విద్య డైరెక్టర్(డీఎంఈ) పరిధిలోని వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, గౌరవవేతనంతో విధులు నిర్వహిస్తున్న 16,024 మంది సిబ్బంది సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి 4 టీఎంసీలు తరలించిన ఏపీ: తెలంగాణ ఫిర్యాదు
నాగార్జునసాగర్ ప్రాజెక్టు దిగువన విద్యుత్ ఉత్పత్తికోసం నిర్మించిన టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఏపీ తరలించుకుపోయిందని కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. -
ఇచ్చంపల్లి నుంచే కావేరికి.. గోదావరి జలాలు
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి నదిపై ఇచ్చంపల్లి బ్యారేజీ నిర్మాణం చేపట్టి, అక్కణ్నుంచి కావేరి పరీవాహకానికి నీటిని తరలించాలని దాదాపు నిర్ణయానికొచ్చారు. -
మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటేసిన సరిహద్దు గ్రామాల ఓటర్లు!
కుమురం భీం జిల్లా కెరమెరి మండలంలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు మధ్య 12 వివాదాస్పద గ్రామాలున్నాయి. -
కారులో తరలిస్తున్న రూ.1.50 కోట్ల స్వాధీనం
వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలంలో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా కారులో తరలిస్తున్న రూ.1.50 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
రికార్డు స్థాయిలో వేసవి రైళ్లు
వేసవి కాలంలో పెరిగే రాకపోకలకు అనుగుణంగా ఈసారి రికార్డు స్థాయిలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. -
బతుకమ్మ చీరల బకాయిలు రూ.50 కోట్లు విడుదల
బతుకమ్మ చీరల తయారీకి సంబంధించి నేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం అధికారులను ఆదేశించారు. -
నటుడు రఘుబాబు అరెస్టు.. బెయిలు
నార్కట్పల్లి- అద్దంకి రహదారిపై ఈ నెల 17న నల్గొండ పట్టణ సమీపంలో సినీ నటుడు ఎర్ర రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడు జనార్ధన్రావు మృతి చెందిన విషయం తెలిసిందే. -
ఒకటో తరగతికి కనీస వయసు ఆరేళ్లపై వివరణ ఇవ్వండి
ఒకటో తరగతికి కనీస వయసు ఆరేళ్లు ఉండాలంటూ జారీ చేసిన ఉత్తర్వులపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శుక్రవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
గురుకులంలో అల్పాహారం వికటించి 25 మందికి అస్వస్థత
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో అల్పాహారం వికటించి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎస్
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి దంపతులు శుక్రవారం తెల్లవారుజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. -
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో మరో ఎస్సై సస్పెన్షన్
పోలీసు శాఖలో సస్పెన్షన్ల పరంపర కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం ఆరుగురు పోలీస్ అధికారులను, సిబ్బందిని మల్టీజోన్-1 ఐజీ సస్పెండ్ చేయగా.. తాజాగా మరో ఎస్సైపై వేటు పడింది.
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు