MLC Eletions: ముగ్గురు తెరాస అభ్యర్థుల ఏకగ్రీవం!
తెలంగాణలోని తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుధవారం నామినేషన్ల పరిశీలన పూర్తయింది. నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సాంకేతిక తప్పిదాల కారణంగా ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఆయా చోట్ల తెరాస అభ్యర్థులు కల్వకుంట్ల కవిత, శంభీపూర్ రాజు, పట్నం మహేందర్రెడ్డిల ఏకగ్రీవ ఎన్నికకు మార్గం సుగమమైంది. మరోవైపు మిగిలిన ఏడు జిల్లాల్లో పరిశీలన అనంతరం 71 నామినేషన్లు
కల్వకుంట్ల కవిత, శంభీపూర్ రాజు, పట్నం మహేందర్రెడ్డిల ఎన్నిక లాంఛనమే
ఏడు జిల్లాల్లో 71 మంది ‘స్థానిక ఎమ్మెల్సీ నామినేషన్ల’కు ఆమోదం
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలోని తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుధవారం నామినేషన్ల పరిశీలన పూర్తయింది. నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సాంకేతిక తప్పిదాల కారణంగా ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఆయా చోట్ల తెరాస అభ్యర్థులు కల్వకుంట్ల కవిత, శంభీపూర్ రాజు, పట్నం మహేందర్రెడ్డిల ఏకగ్రీవ ఎన్నికకు మార్గం సుగమమైంది. మరోవైపు మిగిలిన ఏడు జిల్లాల్లో పరిశీలన అనంతరం 71 నామినేషన్లు ఆమోదం పొందాయి. ఈ నెల 26 వరకు ఉపసంహరణకు గడవు ఉంది. అనంతరం ఒకరి కంటే ఎక్కువ అభ్యర్థులు బరిలో ఉన్న స్థానాల్లో డిసెంబర్ 10న పోలింగ్ జరుగుతుంది. 14న ఓట్లు లెక్కించి ఫలితాల్ని వెల్లడిస్తారు.
26న ఆ ముగ్గురికి ధ్రువీకరణ పత్రాలు..
నిజామాబాద్ జిల్లాలో మంగళవారం తెరాస అభ్యర్థి కవిత నామినేషన్ వేయగా.. స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్ సైతం దాఖలు చేశారు. ఆయన సరైన ఫార్మాట్లో అఫిడవిట్ ఇవ్వకపోవడంతో నామినేషన్ తిరస్కరణకు గురైనట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు తమ సంతకాలను ఫోర్జరీ చేశారంటూ.. ఆయనను బలపరిచినట్లు పేర్లున్న ఎంపీటీసీ సభ్యులు నవనీత, మనోహర్, కార్పొరేటర్ రజియా సుల్తానా సైతం కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
రంగారెడ్డి జిల్లాలో శంభీపూర్ రాజు, పట్నం మహేందర్రెడ్డిలతో పాటు మరో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేసినా ఆయనకు మద్దతుగా ఎవరూ సంతకాలు చేయకపోవడంతో దాన్ని తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన ఈ నెల 26న కవిత, శంభీపూర్ రాజు, మహేందర్రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించి ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు. తెరాస అధిష్ఠానం ఆదేశాల మేరకు.. ఏడు జిల్లాల్లోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు శిబిరాలకు తరలివెళ్లారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బరిలో ప్రత్యర్థులు ఉన్నచోట.. పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని తెరాస ఆదేశించింది.
మహబూబ్నగర్ తెరాస అభ్యర్థుల ఆస్తుల వివరాలు..
ఈనాడు డిజిటల్, మహబూబ్నగర్: మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు తెరాస తరఫున నామినేషన్లు వేసిన సిట్టింగులు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్రెడ్డి తమ ఆస్తుల వివరాలను అఫిడవిట్లో పొందుపరిచారు.
కసిరెడ్డి నారాయణరెడ్డి : (భార్య మాధవిరెడ్డి పేరిట ఉన్నవి కలిపి) చరాస్తులు : రూ.13,00,88,841 ; స్థిరాస్తులు (మార్కెట్ విలువ) : రూ.23,73,82,520 ; అప్పులు : రూ.1,75,02,766.
కూచుకుళ్ల దామోదర్రెడ్డి : చరాస్తులు : రూ.1,20,19,712 ; స్థిరాస్తులు (మార్కెట్ విలువ) : రూ.2,51,00,000.
ఆ ఫిర్యాదుపై తక్షణం నివేదిక ఇవ్వండి: శశాంక్ గోయల్
రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షురాలు చింపుల శైలజ ఫిర్యాదుపై గురువారం ఉదయంలోగా నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ను ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో పోటీకి నామినేషన్ వేసేందుకు వచ్చిన తన నుంచి తెరాస నాయకులు పత్రాలు లాక్కుని చించివేశారని శైలజ, రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు చింపుల సత్యనారాయణరెడ్డి గోయల్కు ఫిర్యాదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
100, 99, 100, 100, 100, 100.. ఇవేంటని సందేహిస్తున్నారా? ఇవి పదో తరగతిలో ఓ విద్యార్థినికి వచ్చిన మార్కులు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి ఈ మార్కులు వచ్చాయి. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం
కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్ టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. -
వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. -
జోరున కురిసి.. భగ్గున మండి
రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. -
దువ్వూరి అనుభవాలకు అక్షర రూపం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమన్వయంతో పనిచేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసు అధికారులకు సూచించారు. -
తిరుమలలో వసంతోత్సవ వైభవం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం 11.52 గంటలకు హైదరాబాద్ నుంచి సున్నిపెంటకు వచ్చిన వారికి హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, -
చిత్ర వార్త
బ్రిటన్లోని కోవెంట్రీ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో విలెన్ హాల్ సోషల్ క్లబ్ ప్రాంగణంలో ఇటీవల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. -
కాలువలో నాటేసినట్లు..
వరిపైరు కాదిది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రావిటీ కాల్వ.. అచ్చం వరి నాటు వేసినట్లు కనిపిస్తోంది కదూ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి.. -
కొత్త వంగడాలను రూపొందించాలి
వాతావరణ మార్పులను తట్టుకోవడంతో పాటు పౌష్టికాహార భద్రత కల్పించే కొత్త వంగడాల రూపకల్పనపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ పిలుపునిచ్చారు. -
ఇదీ సంగతి!
-
మిరప రైతుకు మిగిలింది కన్నీళ్లే..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవటంతో మిరప రైతులు ఆవేదన చెందుతున్నారు. విపణికి సోమవారం సుమారు 13 వేల బస్తాల ఎండు మిరప, 2 వేల బస్తాల తాలు మిరపను తెచ్చారు. -
రాహిల్ బెయిల్ రద్దుపై హైకోర్టు నిర్ణయం వాయిదా
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను అరెస్ట్ చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. -
అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు ప్రారంభం
అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సీపేజీ ఏర్పడంతో మరమ్మతులు చేపట్టారు. -
మే నెలాఖరు వరకు తాగునీటికి లోటు లేదు
రాష్ట్రంలో మే నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. -
సివిల్స్ ర్యాంకర్ అక్షయ్ను అభినందించిన సీఎం
సివిల్స్-2023 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 196వ ర్యాంకు సాధించిన జి.అక్షయ్ దీపక్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
జేఈఈ మెయిన్-2లో పది ప్రశ్నలకు ‘కీ’ మార్పు
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల తుది ‘కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. పది ప్రశ్నలకు ‘కీ’లో మార్పు ఉండగా.. నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపనున్నారు. -
పూడికతీతపై నీటిపారుదల శాఖ దృష్టి
జలాశయాలలో పూడిక మేటలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో సిల్ట్ తొలగింపునకు ఉన్న విధానాలపై తెలంగాణ అధ్యయనం చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
-
సస్పెన్షన్కు గురైన సబ్రిజిస్ట్రార్ ఇంట్లో అనిశా తనిఖీలు.. రూ. 10 కోట్ల ఆస్తుల గుర్తింపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
విజయవాడ తూర్పులో వైకాపాకు షాక్.. తెదేపా గూటికి ఎంవీఆర్ చౌదరి
-
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
-
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్