NTR Family: హద్దు మీరారు.. జాగ్రత్త
ఆంధ్రులంతా అన్నగా అభిమానించే ఎన్టీఆర్ కుమార్తెపై.. అసెంబ్లీలోనే వ్యక్తిగత దూషణలు చేయడం బాధాకరమని నందమూరి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలతో సంబంధం లేని మహిళ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం ఎంతవరకు సమంజసమని నిలదీశారు
ఎన్టీఆర్ కుమార్తెపైనే వ్యక్తిగత దూషణలా?
నందమూరి కుటుంబ సభ్యుల ఆగ్రహం
చేతులు కట్టుకుని కూర్చోం: బాలకృష్ణ
ఈనాడు, అమరావతి: ఆంధ్రులంతా అన్నగా అభిమానించే ఎన్టీఆర్ కుమార్తెపై.. అసెంబ్లీలోనే వ్యక్తిగత దూషణలు చేయడం బాధాకరమని నందమూరి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలతో సంబంధం లేని మహిళ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ మహిళలను ఎంత గౌరవించేవారో గుర్తు చేసుకోవాలని సూచించారు. ‘భువనేశ్వరిపై వ్యక్తిగత దూషణలకు పాల్పడటం ద్వారా వైకాపా నేతలు హద్దు మీరారు.. మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూసుకోండి’ అని హెచ్చరించారు. ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి క్షమాపణ చెప్పాలని, సంబంధిత నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. శనివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నందమూరి స్వాతి కళ్యాణ్రామ్, నందమూరి జయశంకర కృష్ణ, గారపాటి లోకేశ్వరి, గారపాటి శ్రీనివాస్, నందమూరి వసుంధర, నందమూరి సుహాసిని, నందమూరి చైతన్యకృష్ణ, కామినేని సీమంతిని, కంఠమనేని ఉమామహేశ్వరి, శ్రీనివాస ప్రసాద్, నందమూరి జయశ్రీ రామకృష్ణ సహా పలువురు ఎన్టీఆర్ కుటుంబసభ్యులు మాట్లాడారు.
చేతులు కట్టుకుని కూర్చోలేదు
‘చంద్రబాబు కంట తడి ఎప్పుడూ చూడలేదు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అసెంబ్లీలోకి అడుగుపెట్టినట్లు లేదు. శాసనసభలో న్యాయవాదులు, మేధావులు చాలామంది ఉన్నారు. ఇలా జరుగుతోందేంటి అనుకుంటున్నా బయటకు చెప్పలేకపోతున్నారు. సభాపతి ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు.. ప్రభుత్వ పక్షంగా, ఏకపక్షంగా నడపడాన్ని గత అసెంబ్లీ సమావేశాల నుంచి చూస్తున్నాం. వారికీ భార్యా, పిల్లలు ఉన్నారు. మహిళా సాధికారతకు భువనేశ్వరి స్ఫూర్తి. సామాజిక బాధ్యత కింద హిందూపురం నియోజకవర్గానికి కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు పంపారు. మీరెప్పుడైనా ఇలాంటివి చేశారా? దోచుకున్న సొమ్మంతా ఇళ్లలోకి చేర్చడం తప్ప ఇలాంటివి పట్టవు. కులాలు, మతాలు, ప్రాంతాలను చీల్చి ఓట్లు సంపాదించుకున్నారు. వారి కుటుంబ సమస్యను (వివేకానందరెడ్డి హత్యకేసు) పక్కదారి పట్టించేందుకు ఇంత నీచంగా నోరు పారేసుకున్నారు. మేం చేతులు కట్టుకుని కూర్చోలేదు. మహిళలను వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని మాట్లాడితే ఊరుకోం. మెజారిటీ ఉందని విర్రవీగుతూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. ఇంతకాలం సహనంతో ఉన్నామంటే చంద్రబాబుపై గౌరవంతోనే.. ఇక ఆయన అనుమతి అవసరం లేదు. ప్రజలు, కార్యకర్తలు, నా అభిమానులే మెడలు వంచి మిమ్మల్ని మారుస్తారు, ఖబడ్దార్.’
- నందమూరి బాలకృష్ణ
ఆ నలుగురూ హద్దు మీరారు.. జాగ్రత్త
మా ఆడపడుచుకు జరిగినట్లు ఎవరికీ జరగకూడదు. పేర్లు తీసుకురావాల్సి వస్తోంది. తప్పడం లేదు. కొడాలి నాని, వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డీ... మీరు హద్దు మీరారు. జాగ్రత్తగా ఉండండి. భవిష్యత్తు ఎలా ఉంటుందో చూసుకోండి. మీ భార్య, పిల్లలూ మీ గురించి ఏమనుకుంటున్నారో వెనక్కి తిరిగి చూసుకోండి. రాజకీయంగా ఏమైనా ఉంటే చూసుకోండి. వ్యక్తిగతంగా ఇలాంటి వ్యాఖ్యలను ఎన్నడూ చూడలేదు. దేశంలోనే ఎప్పుడూ వినలేదు. రెండు మూడేళ్ల నుంచి రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చూస్తుంటే బాధేస్తోంది. (విలపిస్తూ).. హద్దుల్లో ఉండండి. రావణాసురుడి చరిత్ర ఏమైందో అందరికీ తెలుసు.. అదుపులో ఉండండి.
- నందమూరి రామకృష్ణ
వ్యక్తిగత దూషణలు ఉండకూడదు
ఈనాడు-సినిమా డెస్క్: మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణం. అవి ప్రజా సమస్యలపై జరగాలే గానీ, వ్యక్తిగత దూషణలు, విమర్శలు ఉండకూడదు. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన నా మనసును కలచివేసింది. ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడితే.. అది అరాచక పాలనకు నాంది పలుకుతుంది. స్త్రీ జాతిని గౌరవించటం మన సంస్కృతి. దాన్ని కలచివేసి, కాల్చేసి.. రాబోయే తరాలకు బంగారుబాట వేస్తున్నామనుకుంటే అది చాలా పెద్ద తప్పు. ఈ మాటలు నేను ఒక కుమారుడిగా.. ఒక భర్తగా.. ఒక తండ్రిగా.. ఈ దేశానికి చెందిన ఓ పౌరుడిగా, సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నా. రాజకీయ నాయకులకు ఒకటే విన్నపం. ఈ అరాచక సంస్కృతిని ఇక్కడే ఆపేయండి. ప్రజా సమస్యలపై పోరాడండి.
- ట్విటర్లో జూనియర్ ఎన్టీఆర్
హుందాగా నడుచుకోవాలి
సాటి వ్యక్తిని, ముఖ్యంగా మహిళలను గౌరవించే మన సంప్రదాయంలో మహిళలను అసెంబ్లీలో దూషించే పరిస్థితి ఎదురు కావడం దురదృష్టకరం. అందరూ హుందాగా నడుచుకోవాలి.
- కల్యాణ్రామ్
మా ఇంకో అవతారం చూస్తారు
అసెంబ్లీలో జరిగిన సంఘటన దురదృష్టకరం. చంద్రబాబు హయాంలో విజయమ్మ, భారతి, షర్మిలను ఒక్క మాట అనలేదు, ఎవర్నీ అననివ్వలేదు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం చాలా తప్పు. మాలోనూ ఎన్టీఆర్ రక్తమే ఉంది. మరోసారి ఇలాంటివి జరిగితే తెదేపా కార్యకర్తలు, తమ్ముళ్లు, చెల్లెళ్లు ఏకమవుతారు. మా ఇంకో అవతారం చూస్తారు.
- గారపాటి లోకేశ్వరి
ఆ నాయకులకు వాళ్ల ఇళ్లలోని మహిళలే జవాబు చెప్పాలి
ఏది వినకూడదో, ఏది చూడకూడదో, ఏది మాట్లాడకూడదో.. అన్నీ విన్నాం. నందమూరి కుటుంబ సభ్యులందరికీ బాధగా, కోపంగా ఉంది. రాముడికి సీత ఎలాగో చంద్రబాబుకు భువనేశ్వరి అలాంటివారు. నందమూరి కుటుంబానికి భువనేశ్వరి శ్రీరామరక్ష. ఇలా మాట్లాడిన వారందరికీ వారింట్లోని ఆడవారే జవాబు చెప్పాలి. దేవుడే వారికి సమాధానం చెబుతారు.
- నందమూరి వసుంధర, బాలకృష్ణ భార్య
అన్నా అని పిలిచే ఎన్టీఆర్ కూతురిపై అభాండాలా?
తెలుగు ప్రజలు అన్నా అని పిలుచుకునే నందమూరి తారకరామారావు కుమార్తె గురించి ఇలా మాట్లాడటం బాధాకరం. మా అత్త భువనేశ్వరిపై ఇలాంటి అభాండాలు వేయడం బాధగా ఉంది. ఆమె వ్యక్తిగత విషయాలు ఎప్పుడూ మాట్లాడలేదు. రాజకీయం రాజకీయ నాయకుల మధ్య ఉండాలి. కుటుంబ విషయాలు, కుటుంబసభ్యులు, మహిళలపై మాట్లాడకూడదు. మనం ఎంతైనా వాదించుకోవచ్చు. విభేదాలు ఉండొచ్చు. కుటుంబం అనేది ప్రత్యేకం. వారిని రాజకీయాల్లోకి తీసుకురాకూడదు.
- నందమూరి సుహాసిని, హరికృష్ణ కుమార్తె
ముఖ్యమంత్రి నుంచి ప్రకటన కోరుతున్నా
వల్లభనేని వంశీ, కొడాలి నాని, అంంటి రాంబాబు.. వీళ్లంతా నీచాతి నీచంగా మా అత్త(భువనేశ్వరి) గురించి మాట్లాడారు. సిగ్గూ, లజ్జ ఉందా వారికి? ఇది చాలా తప్పు. ముఖ్యమంత్రి నుంచి ప్రకటన కోరుతున్నా. నానీని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. ఇలా జరిగినందుకు మీరూ క్షమాపణ చెప్పాలి. మీ మీడియా సమావేశం కోసం మేం ఎదురుచూస్తున్నాం. నందమూరి తారక రామారావు మహిళలకు ఎంతో గౌరవం ఇచ్చేవారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చాక మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చారు. చంద్రబాబు పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి మహిళల్ని వెన్నుతట్టి ప్రోత్సహించారు. హరికృష్ణ మంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీలో మహిళా కండక్టర్లను నియమించారు. ఎన్టీఆర్ తీసిన సినిమాల్లోనూ మహిళలకే ప్రాధాన్యం ఇచ్చారు. ఎప్పుడైనా మహిళల్ని వెన్నుతట్టి ప్రోత్సహించాలి.
- నందమూరి చైతన్య కృష్ణ, ఎన్టీఆర్ మనవడు
వైకాపాలో మహిళల్ని ఎలా గౌరవిస్తారో అర్థమైంది
భువనేశ్వరి కుటుంబ బాధ్యతనే కాకుండా రాజకీయపరంగా కూడా చంద్రబాబుకు ఎంతో మద్దతు ఇస్తున్నారు. మీరెప్పుడైనా మహిళలకు గౌరవం ఇస్తే మీకు అర్థమవుతుంది. అసెంబ్లీలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదు. కానీ భువనేశ్వరి పేరెత్తి చంద్రబాబుతో కన్నీరు పెట్టించారు. ఎన్టీఆర్ వారసులుగా హెచ్చరిస్తున్నాం. ఇలాంటి చీప్ పాలిటిక్స్ మానుకోండి.. వైకాపాలో మహిళలు ఎమ్మెల్యేలు, మంత్రి పదవుల్లో ఉన్నారు. మీ నాయకులు ఇలా మాట్లాడుతున్నారంటే ఆ పార్టీలో మహిళలకు ఎలాంటి గౌరవం ఇస్తారో అర్థమైంది.
- గారపాటి శ్రీనివాస్
వారిని భార్యాపిల్లలు ఎలా భరిస్తున్నారో?
విలువలు లేనివారు మాట్లాడే మాటలివి. వారిని భార్య, పిల్లలు ఎలా భరిస్తున్నారో అర్థం కావట్లేదు. వీరి తీరుతో ప్రజలు భయంతో బతుకుతున్నారు. ఆ భయం పోతే ఈ నాయకులకు దిక్కు దివాణం ఉండదు. ఎలా వచ్చారో, టికెట్ ఎలా ఇప్పించుకున్నారో మర్చిపోకండి. నందమూరి కుటుంబంలో ఎంతో మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు.
- కామినేని సీమంతిని
ఈ అరాచక సంస్కృతిని ఆపేయండి
చంద్రబాబు సతీమణిపై వ్యాఖ్యల నేపథ్యంలో సినీతారల స్పందన
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరిపై అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేయడాన్ని సినీ ప్రముఖులు ఖండించారు. నోటికొచ్చినట్లు మాట్లాడటం తగదన్నారు. ఈ మేరకు పలువురు తారలు సామాజిక మాధ్యమాల వేదికగా తమ స్పందనను తెలియజేశారు.
పశువుల కంటే హీనంగా..
ప్రజాసమస్యలపై అర్థవంతమైన చర్చలు జరగాల్సిన అసెంబ్లీలో కొందరు సభ్యులు పశువుల కంటే హీనంగా చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరిపై అసభ్య వ్యాఖ్యలు చేయడం దిగ్భ్రాంతికరం. రాజకీయ విమర్శలు.. విధానాలపై ఉండాలి కానీ, కుటుంబ సభ్యులపై అసభ్యంగా మాట్లాడటం క్షమార్హం కాదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండటం వల్లే మీ మనుగడ సాగింది. శిశుపాలుడి వంద తప్పులు పూర్తయినట్టు నిన్నటితో మీ వంద తప్పులు పూర్తయ్యాయి. ఇక, మీ అరాచకాన్ని ఉపేక్షించేది లేదు. ప్రతి ఒక్క తెలుగుదేశం సైనికుడు వైకాపా దుశ్శాసనుల భరతం పడతారు. ఇలాంటి స్థాయిలేని వ్యక్తుల మధ్యలో మీరు రాజకీయం చేయాల్సి రావడం దురదృష్టకరం పెదనాన్నా. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మేమంతా మీ వెంటే ఉంటాం.
- నారా రోహిత్
స్థాయి లేనివారి మాటలకు ఆవేదన చెందక్కర్లేదు
ఏమాత్రం స్థాయి లేని వ్యక్తులు అన్న మాటలకు, కల్పించిన హీనమైన సందర్భాలకు చంద్రబాబు, ఆయన సతీమణి ఎంతమాత్రం ఆవేదన చెందాల్సిన అగత్యం లేదు. నీచ సంస్కృతికి అద్దం పడుతున్న ఈ పనికిమాలిన వారి ప్రమాణాలకు అతీతమైన ఎత్తులో ఉన్న వ్యక్తులు చంద్రబాబు, ఆయన సతీమణి. తెలుగువారు అత్యంత ఆత్మీయంగా అభిమానించే ప్రేమమూర్తులు వాళ్లు.
- అశ్వినీదత్, ప్రముఖ నిర్మాత
తీవ్ర మనస్తాపానికి గురిచేసింది
తెదేపా అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యుల్ని కించపరిచేలా కొందరు వ్యాఖ్యలు చేయడం బాధాకరమైన విషయం. మీడియా సమావేశంలో ఆయన కంట తడి పెట్టడం తీవ్ర మనస్తాపానికి గురి చేసింది
- రాఘవేంద్రరావు, ప్రముఖ దర్శకుడు
వ్యక్తిగత విమర్శలు తగదు
వ్యక్తిగతంగా దూషించడం అసహ్యకరమైన పని. ఇప్పుడు చంద్రబాబు సతీమణిపై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఆమెకు కుటుంబ వ్యవహారాలు, వ్యాపారం తప్ప రాజకీయాలతో సంబంధం లేదు. మీరు వ్యక్తిగత దూషణలు చేయొద్దు. అలాగే తెదేపా వాళ్లు సీఎం జగన్ను వ్యక్తిగతంగా తిట్టొద్దు. ఆయన పరిపాలనను విమర్శించండి. ఇది చెత్త సంప్రదాయం. మహిళలపై వ్యక్తిగత విమర్శలు చేయటం తగదు. చంద్రబాబు తన ముఖంలో ఎమోషన్స్ను చాలా కంట్రోల్ చేసుకుంటారు. కానీ, తొలిసారి కన్నీటి పర్యంతమవటం నాకు చాలా బాధనిపించింది. కుటుంబ సభ్యులను విమర్శిస్తే ఎంత బాధాకరంగా ఉంటుందో మాకు తెలుసు. రాజకీయాల్లో ఉన్న ఎవరినైనా విమర్శించవచ్చు. అయితే అవి వ్యక్తిగతంగా చేయకూడదు. కల్యాణ్బాబు ఎప్పుడూ వ్యక్తిగత దూషణలకు వెళ్లలేదు. ఇకకైనా ఈ సంప్రదాయానికి ముగింపు పలకండి.
- నాగబాబు, నటుడు, నిర్మాత
రాజకీయాలపై ఏహ్యభావం
తన భార్యను కించపరిచారని, ఆమె గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేలా మాట్లాడారని చంద్రబాబు కంటతడి పెట్టడం బాధాకరం. ఇలాంటి ఘటనలు సామాన్యులకు రాజకీయ వ్యవస్థపై ఏహ్యభావం కలిగించే ప్రమాదం ఉంది.
- బండ్ల గణేశ్, నిర్మాత
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’