పెట్రో ధరల తగ్గింపు
అధిక ధరల భారంతో అల్లాడిపోతున్న ప్రజలపై కేంద్ర ప్రభుత్వం ఉపశమనపు జల్లును కురిపించింది. నిత్యావసరాల పెంపునకు, తద్వారా ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తున్న పెట్రో ఉత్పత్తుల ధరల పరుగులకు కళ్లెం వేసింది.
పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ సుంకంలో కోత
లీటర్కు వరుసగా రూ.8, రూ.6 చొప్పున ఉపశమనం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన
రాష్ట్రాలు కూడా ఇదే బాటలో నడవాలని పిలుపు
ఉజ్వల్ లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్పై రూ.200 రాయితీ
ప్లాస్టిక్, ఉక్కు ముడి సరకులపైనా కస్టమ్స్ సుంకం తగ్గింపు
హైదరాబాద్లో పెట్రోలు రూ. 10.91 డీజిల్ రూ. 7.64 మేర ఊరట
ఈనాడు, దిల్లీ: అధిక ధరల భారంతో అల్లాడిపోతున్న ప్రజలపై కేంద్ర ప్రభుత్వం ఉపశమనపు జల్లును కురిపించింది. నిత్యావసరాల పెంపునకు, తద్వారా ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తున్న పెట్రో ఉత్పత్తుల ధరల పరుగులకు కళ్లెం వేసింది. లీటర్ పెట్రోల్పై రూ.8, డీజిల్పై రూ.6 మేర ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ శనివారం సాయంత్రం ట్విటర్ ద్వారా ప్రకటించారు. దీంతో ఆ రెండు ఇంధనాల ధర లీటర్కు వరుసగా రూ.9.50, రూ.7 వరకు దిగి వస్తుందని తెలిపారు. ఎక్సైజ్ సుంకంలో కోత నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ.లక్ష కోట్ల ఆదాయం కోల్పోనుందని పేర్కొన్నారు. రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్పై పన్నులను తగ్గించాలని ఆమె సూచించారు. ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన లబ్ధిదారులకు ఒక్కో గ్యాస్ సిలిండర్పై రూ.200 (12 సిలిండర్ల వరకు) రాయితీ ప్రకటించారు. ప్లాస్టిక్, ఉక్కు ఉత్పత్తులకు అవసర ముడిసరకులు, ఉపకరణాలపైనా కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. సిమెంటు లభ్యత పెంచడంతో పాటు దాని ధర తగ్గింపునకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఏడు నెలల్లో రెండోసారి
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఎన్నడూలేని స్థాయికి చేరడంతో దాని ప్రభావం అన్ని రంగాలపైనా పడుతూ వస్తోంది. దానివల్ల టోకు ద్రవ్యోల్బణం 15.08శాతానికి, రిటైల్ ద్రవ్యోల్బణం 7.79%కి చేరి ఎనిమిదేళ్ల రికార్డును బద్దలుకొట్టింది. సిమెంటు, స్టీల్ ధరలు పెరిగి గృహనిర్మాణంపై తీవ్రప్రభావం చూపుతోంది. ఫలితంగా ఉపాధి కల్పన పడిపోతుండడంతో కేంద్రం దిద్దుబాటుకు దిగింది.
* గత ఏడాది నవంబరులో కేంద్రం లీటర్ పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఇప్పుడు రూ.8, రూ.6 చొప్పున కోత వేసింది. దీంతో ప్రస్తుతం పెట్రోల్పై రూ.19.9, డీజిల్పై రూ.15.8 చొప్పున ఎక్సైజ్ సుంకం అమల్లో ఉంటుంది.
* 2020లో గరిష్ఠంగా లీటర్ పెట్రోల్పై రూ.32.9, డీజిల్పై రూ.31.8 ఎక్సైజ్ సుంకం అమల్లో ఉండేది. అప్పటి నుంచి ఇప్పటివరకు పెట్రోల్ రూ.13., డీజిల్పై రూ.16 తగ్గించినట్లయింది.
* కేంద్రం తాజా పిలుపునకు కేరళ సర్కారు వెంటనే స్పందించింది. తమ రాష్ట్రంలో లీటరు పెట్రోల్పై విధిస్తున్న పన్నులో రూ.2.41, డీజిల్పై పన్నులో రూ.1.36 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
కష్టకాలంలోనూ సంక్షేమ పథం: నిర్మల
మోదీ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అంకితమైందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు.‘‘ప్రధాని మోదీ హామీల దృష్ట్యా పేదలను ఆదుకోవడానికి మరికొన్ని చర్యలు ప్రకటిస్తున్నాం. ఇందులో భాగమే పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు. దీన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాలి. ఉజ్వల్ యోజన లబ్ధిదారులకు ఒక్కో సిలిండర్పై రూ.200 (12 సిలిండర్ల వరకు) రాయితీ ఇస్తాం. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై సంవత్సరానికి రూ.6,100 కోట్ల భారం పడుతుంది’’ అని నిర్మలాసీతారామన్ తెలిపారు.
కంటి తుడుపు చర్యే: కాంగ్రెస్
ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించిన పెట్రో ధరల తగ్గింపు కంటి తుడుపు చర్య మాత్రమేనని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్సింగ్ సూర్జేవాలా విమర్శించారు. ‘గత 60 రోజుల్లో లీటర్ పెట్రోల్పై రూ.10 పెంచి రూ.9.50 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. డీజిల్ ధర విషయంలోనూ 60 రోజుల్లో రూ.10 పెంచి ఇప్పుడు రూ.7 తగ్గిస్తున్నట్లు చెప్పారు. 2014 మే స్థాయికి ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించండి’’ అని డిమాండ్ చేశారు.
బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ మాత్రమే రాష్ట్రాలకు
కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం పేరుతో భారీగా వసూలు చేస్తున్నా, పన్నుల వాటా రూపంలో రాష్ట్రాలకు తిరిగిచ్చేది మాత్రం స్పల్పంగా ఉంటోంది. తాజాగా పెట్రోల్పై లీటర్కు రూ.8, డీజిల్పై రూ.6 తగ్గించడంతో వాటిపై వసూలు చేసే ఎక్సైజ్ డ్యూటీ వరుసగా రూ.19.90, రూ.15.80కి తగ్గిపోయింది. వాస్తవంగా కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంచే వాటా ప్రకారం ఇందులో 41% రాష్ట్రాలకు రావాలి. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఎక్సైజ్ డ్యూటీని బేసిక్, స్పెషల్ అడిషినల్, అడిషినల్ ఎక్సైజ్డ్యూటీల పేరుతో మూడు వేర్వేరు విభాగాల కింద విభజించింది. ఇందులో పెట్రోల్పై బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ కింద లీటర్కు రూ.1.40, డీజిల్పై రూ.1.80 వసూలు చేస్తోంది. ఈ మొత్తాన్ని మాత్రమే పన్ను వాటా కింద రాష్ట్రాలకు పంచుతోంది. 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన ఫార్ములా ప్రకారం రాష్ట్రాలకు పెట్రోలియం ఉత్పత్తులపై విధించే బేసిక్ ఎక్సైజ్ డ్యూటీని మాత్రమే రాష్ట్రాలకు పంచుతున్నామని, ప్రస్తుతం ఇది పెట్రోల్పై రూ.1.40, డీజిల్పై రూ.1.80 మాత్రమే ఉందని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. అందుకే 2020-21 ఆర్థిక సంవత్సరంలో పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి రూ.3,71,908 కోట్లు వచ్చినా అందులో రాష్ట్రాలకు రూ.19,972 కోట్లు మాత్రమే పంపిణీ చేసింది. అంటే మొత్తం వసూలైన సుంకాల్లో రాష్ట్రాలకు దక్కింది 5.37% మాత్రమే. ఇప్పుడు కూడా ఇదే విధానం కొనసాగనుంది.
రాష్ట్రంలో 13 లక్షల మంది ‘ఉజ్వల్’ లబ్ధిదారులకు సాంత్వన
ఈనాడు, హైదరాబాద్: పెట్రోలు, డీజిల్పై కేంద్రప్రభుత్వం పెద్దమొత్తంలో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో వినియోగదారులకు భారీగా ఊరట లభించనుంది. తెలంగాణలో లీటరు పెట్రోలుపై రూ.10.91, డీజిల్పై 8 రూపాయలకు పైగా తగ్గుతుందని సమాచారం. రాష్ట్రంలో పెట్రోలుపై 35.20 శాతం, డీజిల్పై 27 శాతం వ్యాట్ను ప్రభుత్వం వసూలు చేస్తోంది. పెట్రోలు, డీజిల్పై కలిపి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం లీటరుకు రూ.4.50కు పైగా తగ్గుతుందని అంచనా. ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన వినియోగదారులకు గ్యాస్ సిలిండరు ధరపై కేంద్రం రూ.200 రాయితీ ఇచ్చింది. ఈ తగ్గింపుతో రాష్ట్రంలో సుమారు 13 లక్షల మంది వినియోగదారులకు ఊరట లభించనుంది. ప్రస్తుతం గ్యాస్ ధర రూ.1,055 ఉండగా ఆదివారం నుంచి రూ.855కు తగ్గుతుంది.
ప్రజల కోసమే..
మాకు అన్నింటి కంటే ప్రజలే ముఖ్యం. ఈ రోజు తీసుకున్న నిర్ణయాల వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గుతాయి. విభిన్న రంగాలపై అది సానుకూల ప్రభావం చూపుతుంది. ప్రజలకు ఉపశమనం కల్గించి, జీవనాన్ని మరింత సులభంగా మారుస్తుంది. ఉజ్వల పథకం కోట్ల మంది ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు మేలు చేసింది. ఉజ్వల గ్యాస్ రాయితీపైౖ తీసుకున్న నిర్ణయం కుటుంబాల బడ్జెట్ను సరళతరం చేస్తుంది
- ట్విటర్లో ప్రధాని నరేంద్ర మోదీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.