ఉపాధి కల్పనే ప్రథమ కర్తవ్యం
భారీఎత్తున పెట్టుబడులను ఆకర్షించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా చూడడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్
ఈనాడు, హైదరాబాద్: భారీఎత్తున పెట్టుబడులను ఆకర్షించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా చూడడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రవాసులు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములై పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని.. స్వరాష్ట్రంలో కంపెనీలు స్థాపించి సంపద సృష్టించాలన్నారు. పెట్టుబడులకు హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని మిగతా పట్టణాలు, నగరాలనూ పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. విదేశీ పర్యటనలో భాగంగా శనివారం బ్రిటన్లోని ప్రవాస తెలంగాణ సంఘాలు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ ప్రసంగించారు. ‘‘తెలంగాణ ఉద్యమానికి ప్రవాసులు ఎంతగానో సహకరించారు. రాష్ట్రం సాధించిన విజయాలలో వారిది గొప్ప పాత్ర. లండన్లో పారిశ్రామికవేత్తలతో భేటీ సందర్భంగా చాలా మంది పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చారు. పాలన వ్యవస్థను వికేంద్రీకరించడం, అభివృద్ధిలో సమతూకం పాటించడం తెరాస ప్రభుత్వ విజయాలకు ప్రధాన కారణం. అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్, క్వాల్కామ్, ఉబర్, సేల్స్ఫోర్స్, నోవార్టిస్ తదితర సంస్థలు ఆమెరికా ఆవల తమ అతిపెద్ద ప్రాంగణాలను హైదరాబాద్లోనే ఏర్పాటు చేశాయి. మాదాపూర్లోనే గాక మారుమూల గ్రామాల్లోనూ పరిశ్రమలను ఏర్పాటు చేయిస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రంలో 24 గంటల కరెంట్తోపాటు పారిశ్రామిక అనుకూల వాతావరణం ఏర్పడింది. కేవలం నాలుగు సంవత్సరాల్లోనే కాళేశ్వరాన్ని పూర్తిచేయడం ద్వారా నీటి సమస్య తీరింది. అంకురంగా మొదలైన తెలంగాణ విజయప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. ఈ ప్రయాణాన్ని ప్రవాసులు మరింత ముందుకు తీసుకెళ్లాలి’’ అని కేటీఆర్ సూచించారు. నాలుగురోజులుగా లండన్లో పారిశ్రామికవేత్తలతో సమావేశాల్లో పాల్గొన్న ఆయన శనివారం తెరాస లండన్ ప్రవాస విభాగం అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ఇంటికి వెళ్లారు. బతుకమ్మ గురించి క్వీన్ ఎలిజబెత్కు వివరాలు అందిస్తూ అనిల్ కూర్మాచలం కుమార్తె నిత్య రాసిన లేఖకు క్వీన్ నుంచి వచ్చిన ప్రశంస గురించి తెలుసుకున్న మంత్రి నిత్యను అభినందించారు. అనిల్ బృందం సేవలను ప్రశంసించారు.
విద్యుత్ వాహనాల పరిశ్రమ సందర్శన
మంత్రి కేటీఆర్ బాన్బరీలోని ప్రసిద్ధ విద్యుత్ వాహనాల తయారీ సంస్థ అరైవల్ యూకే లిమిటెడ్ను సందర్శించారు. ఆర్టీసీ, మెట్రో రైల్వే స్టేషన్లకు అరైవల్ బస్సులు, అంబులెన్సుల కొనుగోళ్లపై కేటీఆర్ చర్చించారు. ఇలాంటి సంస్థలు తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు రావాలన్నారు.
దావోస్కు పయనం
మంత్రి కేటీఆర్ లండన్ పర్యటన ముగిసింది. శనివారం రాత్రి స్విట్జర్లాండ్లోని దావోస్ నగరానికి పయనమయ్యారు. దావోస్లో ఆదివారం నుంచి ఈ నెల 26 వరకు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొంటారు. అనంతరం వివిధ దేశాల రాజకీయ, అధికార, వ్యాపార ప్రముఖులతో సమావేశం కానున్నారు. దావోస్లో పారిశ్రామికవేత్తలతో భేటీ కోసం తెలంగాణ పెవిలియన్ను ఏర్పాటు చేశారు.
కార్యాలయ స్థల వినియోగంలో తెలంగాణ అగ్రస్థానం
కార్యాలయ స్థల వినియోగంలో బెంగళూరును అధిగమించి హైదరాబాద్ దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని.. ఇది తెలంగాణకు గర్వకారణమని మంత్రి కేటీఆర్ శనివారం ట్విటర్లో తెలిపారు. తక్కువ అద్దెలు, స్థిరమైన వ్యాపార అవకాశాలు.. హైదరాబాద్ను కార్యాలయ స్థల వినియోగ మార్కెట్ చార్టులో అగ్రస్థానాన నిలబెట్టాయని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ