Mercedes Benz:రూ.1100 కోట్లు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు!
ఖరీదైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ సరికొత్త రికార్డు సృష్టించింది. 67 ఏళ్ల కారును రూ.వందల కోట్లకు విక్రయించింది........
ఇంటర్నెట్ డెస్క్: ఖరీదైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ సరికొత్త రికార్డు సృష్టించింది. 67 ఏళ్ల కారును వందల కోట్లకు విక్రయించింది. 1955లో రూపొందించిన ఓ కారును ఏకంగా 135 మిలియన్ యూరోలకు విక్రయించింది. 1955 నాటి మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఆర్ కూపే మోడల్ వేలంపాటలో 142 మిలియన్ డాలర్లకు (దాదాపు 1100 కోట్లు) అమ్ముడుపోయినట్లు తెలిపింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు ఇదేనని సంస్థ వెల్లడించింది. కార్ల చరిత్రలోనే మరే ఇతర కారుకు ఇంత ధర పలికిన దాఖలాలు లేవు. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును గ్లోబల్ స్కాలర్షిప్ ఫండ్ కోసం ఉపయోగిస్తామని మెర్సిడెస్ తెలిపింది.
1963లో తయారైన ఫెరారీ 250 జీటీఓ కారుకు 2018లో జరిగిన వేలంపాటలో 70మిలియన్ డాలర్లు దక్కాయి. ఆ తర్వాత ఈ మెర్సిడెస్ కారుకే భారీ ధర పలికింది. ఫెరారీ కారుతో పోలిస్తే ఇది మూడు రెట్లు అధిక ధరకు అమ్ముడుపోవడం విశేషం. 67 ఏళ్ల తర్వాత మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఆర్ కూపే మోడల్లో ప్రస్తుతం రెండు కార్లు మాత్రమే ఉన్నాయి. మరో వాహనం జర్మనీలోని స్టుట్గార్ట్లోని మెర్సిడెజ్-బెంజ్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. అప్పటి చీఫ్ ఇంజినీర్ పేరును ఈ కార్లకు పెట్టారు. ఇవి గంటకు 186 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. 300 హార్స్పవర్తో 8 సిలిండర్ల ఇంజిన్ ఉంటుంది. కారు డోర్లు పైకి ఉంటాయి. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా డ్రైవర్కు రక్షణ కల్పించడం దీని ప్రత్యేకత.
మే 5న స్టట్గర్ట్లో మెర్సిడెస్ బెంజ్ మ్యూజియంలో ప్రైవేటుగా అతికొద్ది మంది సమక్షంలో ఈ వేలంపాటను నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే ఈ కారును ఎవరు దక్కించుకున్నారనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. వేలంపాటలో పాల్గొన్న కార్ డీలర్ బ్రయాన్ రాబోల్డ్ తన క్లయింట్ కోసం కారును కొనుగోలు చేసినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు