US China: వింటర్ ఒలింపిక్స్లో జోక్యం కాదు.. ముందు ఆ వివాదాన్ని తీవ్రంగా పరిగణించండి
బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ సమీపిస్తున్న క్రమంలో చైనా తాజాగా మరోసారి అమెరికాపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ విశ్వక్రీడల విషయంలో జోక్యం చేసుకోవడాన్ని మానుకోవాలని హెచ్చరించింది. బదులుగా.. యూరప్లో రష్యాతో నెలకొన్న భద్రతా ఆందోళనలను తీవ్రంగా పరిగణించాలని సూచించింది. చైనా...
అమెరికాకు చైనా హెచ్చరిక!
ఇంటర్నెట్ డెస్క్: బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ సమీపిస్తున్న క్రమంలో చైనా తాజాగా మరోసారి అమెరికాపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ విశ్వక్రీడల విషయంలో జోక్యం చేసుకోవడాన్ని మానుకోవాలని హెచ్చరించింది. బదులుగా.. యూరప్లో రష్యాతో నెలకొన్న భద్రతా ఆందోళనలను తీవ్రంగా పరిగణించాలని సూచించింది. చైనా, అమెరికా విదేశాంగ మంత్రులు వాంగ్ యీ, ఆంటోని బ్లింకెన్ల తాజా టెలిఫోన్ సంభాషణపై.. డ్రాగన్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. బీజింగ్లో ఫిబ్రవరి 4 నుంచి వింటర్ ఒలింపిక్స్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కరోనా కలవరం కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ.. ఈ క్రీడలను విజయవంతంగా నిర్వహించాలని చైనా పట్టుదలతో ఉంది. అయితే.. ఆ దేశంలోని షింజియాంగ్ ప్రావిన్స్ తదితర చోట్ల మానవ హక్కుల ఉల్లంఘనను నిరసిస్తూ.. అమెరికా ఈ వింటర్ ఒలింపిక్స్ను దౌత్యపరంగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ క్రమంలోనే వాంగ్ యీ మాట్లాడుతూ.. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్లో అమెరికా తన జోక్యాన్ని మానుకోవడమే అత్యంత ముఖ్యమైన విషయమని తెలిపారు. తైవాన్ సమస్యపై నిప్పుతో చెలగాటమాడటాన్ని ఆపేయాలని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ విషయంలో యూరప్లో పెరుగుతోన్న ఉద్రిక్తతలను ప్రస్తావిస్తూ.. అమెరికా ప్రస్తుతం ఈ సమస్యను తీవ్రంగా పరిగణించాలని కోరారు. అన్ని పక్షాలు ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వాన్ని వదిలిపెట్టి, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. యూరప్లో నాటో కూటమి విస్తరణపై రష్యా ఆందోళనలకు పరోక్షంగా మద్దతు పలుకుతూనే.. సైనిక కూటముల బలోపేతం, విస్తరణతో ప్రాంతీయ భద్రత సాధ్యంకాదని తెలిపారు. ఈ చర్చలపై అమెరికా కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణతో ప్రపంచ భద్రతకు వాటిల్లే ముప్పు, ఆర్థిక నష్టాలను బ్లింకెన్ నొక్కిచెప్పినట్లు అందులో పేర్కొంది. అయితే, అందులో వింటర్ ఒలింపిక్స్ ప్రస్తావన లేకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.