Cold Virus: కోల్డ్ వైరస్.. ఏడాదిలోనే లక్షమంది చిన్నారుల మరణం
జలుబు వంటి లక్షణాలకు కారణమయ్యే ఓ సాధారణ వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఒక్క ఏడాదే లక్ష మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని తాజా అధ్యయనం వెల్లడించింది.
లాన్సెట్ అధ్యయనంలో వెల్లడి
లండన్: జలుబు వంటి లక్షణాలకు కారణమయ్యే ఓ సాధారణ వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఒక్క ఏడాదే లక్ష మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా ఐదేళ్ల లోపు చిన్నారుల్లోనే ఈ మరణాలు అధికంగా సంభవిస్తోన్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన అధ్యయన నివేదిక ది లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైంది.
రెస్పిరేటరీ సైన్సైటియల్ వైరస్..
చిన్నారుల్లో రెస్పిరేటరీ సైన్సైటియల్ వైరస్ (RSV) ప్రభావాన్ని అంచనా వేసేందుకు బ్రిటన్ పరిశోధకులు తాజా అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా ఒక్క 2019లోనే ఆరు నెలల్లోపు వయసున్న 45వేల మంది చిన్నారులు ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్ఎస్వీ వైరస్ బారిన పడుతోన్న ప్రతి ఐదుగురిలో ఒకరు చనిపోతున్నట్లు తెలిపారు. చిన్నారులు పుట్టిన 28 రోజుల నుంచి ఆరు నెలల మధ్య కాలంలోనే ఆర్ఎస్వీ మరణాల ముప్పు అధికంగా ఉందన్న నిపుణులు.. వైద్య సదుపాయం ఉన్న ప్రాంతాల్లో ముప్పు తక్కువగానే ఉందన్నారు. పేద దేశాల్లోనే ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉన్నట్లు పరిశోధకులు స్పష్టం చేశారు.
ప్రతి ఏటా లక్ష మంది..
ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారుల్లో ఏటా ఆర్ఎస్వీ సంబంధిత కేసులు భారీ సంఖ్యలో నమోదవుతుండగా కేవలం 2019లోనే 3.3కోట్ల కేసులు నమోదయ్యాయి. వీరిలో 36లక్షల మంది ఆస్పత్రుల్లో చేరారు. అందులో 26,300 మంది ఆస్పత్రుల్లోనే మరణించగా.. ఆ ఏడాది మొత్తంగా 1,01,400 ఆర్ఎస్వీ సంబంధిత మరణాలు సంభవించినట్లు పరిశోధకులు లెక్కగట్టారు. ఆ వయసు పిల్లల్లో వివిధ రకాల కారణాలతో ప్రాణాలు కోల్పోయే ప్రతి 50 మందిలో ఒకరు ఆర్ఎస్వీ వల్లే చనిపోతున్నారు. ఇక ఈ ఏడాది (2019)లో ఆరు నెలల్లోపు వయసున్న చిన్నారుల్లో ఆర్ఎస్వీ సంబంధిత కేసులు ప్రపంచవ్యాప్తంగా 66లక్షలు వెలుగు చూడగా.. వీరిలో 14లక్షల మంది ఆస్పత్రుల్లో చేరారు. అయితే, ఆస్పత్రుల్లో చేరుతున్న వారిలో కేవలం 20శాతం మందిలోనే మరణాలు చోటుచేసుకుండగా.. కమ్యూనిటీ స్థాయిలోనే 80శాతం మరణాలు జరుగుతున్నట్లు తాజా అధ్యయనం పేర్కొంది. ముఖ్యంగా ఈ ఆర్ఎస్వీ మరణాలు అధికంగా పేద, మధ్య ఆదాయ దేశాల్లోనే సంభవిస్తున్నట్లు తాజా అధ్యయనం స్పష్టం చేసింది.
ఐదేళ్లలోపు చిన్నారుల్లోనే..
‘చిన్నారుల్లో తీవ్ర శ్వాసకోస ఇన్ఫెక్షన్కు ఆర్ఎస్వీ ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఆరు నెలల చిన్నారులు, యుక్తవయసు పిల్లలకు ముప్పు అధికంగా ఉన్నట్లు అంచనా వేస్తున్నాం’ అని అధ్యయన సహ రచయిత, యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్కు చెందిన నిపుణులు హరీశ్ నాయర్ పేర్కొన్నారు. ‘అయితే కొవిడ్ ఆంక్షలు సడలిస్తోన్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన రెండేళ్లలో పుట్టిన చిన్నారుల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వారు ఈ వైరస్ బారినపడలేదు. దీంతో ఈ వైరస్ను ఎదుర్కొనే రోగనిరోధకత వారిలో వృద్ధి కాలేదు’ అని హరీశ్ నాయర్ వెల్లడించారు. అయితే, ఈ వైరస్ను ఎదుర్కొనే వ్యాక్సిన్ అభివృద్ధి చేసేందుకు పలు కంపెనీలు కృషి చేస్తున్నట్లు హరీశ్ నాయర్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
కొరియా ద్వీపకల్పంలో ఐరాస విధించిన ఆంక్షలు ప్రాంతీయ భద్రతను మెరుగుపరిచేందుకు ఏమాత్రం ఉపయుక్తంగా లేవని రష్యా పేర్కొంది. -
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
సిరియాలోని అతిపెద్ద నగరం అలెప్పోపై ఇజ్రాయెల్ చేపట్టిన గగనతల దాడుల్లో దాదాపు 42 మంది మృతి చెందారు. -
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
Israel-Hamas War: ఇజ్రాయెల్పై దాడి చేసిన సమయంలో హమాస్ ఓ మహిళను నగ్నంగా ఊరేగిస్తూ గాజా తీసుకెళ్లింది. ఆ దృశ్యం తాజాగా ‘ఫొట్ ఆఫ్ ది ఇయర్’గా నిలవడం గమనార్హం. -
నిన్న అమెరికా, నేడు ఐరాస.. కేజ్రీవాల్ అరెస్ట్పై యూఎన్ స్పందన
UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. -
నాటో దేశాలపై దాడులు చేయం
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఖండించారు. కానీ ఉక్రెయిన్కు పశ్చిమ దేశాలు ఎఫ్-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. -
ప్రధానిగా, మంచి తండ్రిగా వ్యవహరించడం కష్టం: సునాక్
ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం..మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉంటూ సమన్వయం చేసుకోవడం తనకు కష్టమైనపనిగా ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పేర్కొన్నారు. -
16కు చేరిన లెబనాన్ మృతులు
లెబనాన్లోని దక్షిణ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మంగళవారం రాత్రి జరిగిన ఈ దాడుల్లో తొలుత ఏడుగురు పారామెడికల్ సిబ్బంది మరణించినట్లు వార్తలొచ్చాయి. -
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
దక్షిణాఫ్రికాలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు బ్రిడ్జి నుంచి లోయలో పడడంతో 45 మంది మృతిచెందారు. -
నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టేయలేం: ట్రూడో
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
హవాయ్లో ఇంధన తొలగింపు పూర్తి
హవాయ్లోని భూగర్భ ఇంధన ట్యాంక్ కాంప్లెక్సు నుంచి మిలియన్ల కొద్దీ గ్యాలన్ల ఇంధనం తొలగింపు పూర్తయిందని అమెరికా సైన్యం తెలిపింది. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత్ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. -
ఉత్తర కొరియాపై ఆంక్షల పర్యవేక్షణ కమిటీ
ఉత్తర కొరియా అణు కార్యక్రమంపై విధించిన ఆంక్షలను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకుంది. -
ఇద్దరి మృతదేహాల వెలికితీత
అమెరికాలోని బాల్టిమోర్లో నౌక ఢీకొని వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను బుధవారం సహాయక సిబ్బంది వెలికితీశారు. -
ఉక్రెయిన్పై దాడుల పరంపర
ఉక్రెయిన్లోని దక్షిణ, తూర్పు ప్రాంతాలపై బుధవారం రాత్రి రష్యా క్షిపణలు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజను మందికిపైగా గాయపడ్డారని గురువారం అధికారులు వెల్లడించారు. -
మాలిలో వాగ్నర్ గ్రూపు
ఆఫ్రికా దేశమైన మాలిలో ప్రభుత్వ బలగాలకు రష్యా అనుకూల వాగ్నర్ గ్రూపు సహకరిస్తోంది. మాలి మధ్య, ఉత్తర ప్రాంతంలో ఇటీవల సోదాలు, డ్రోన్లద్వారా ప్రభుత్వ బలగాలు చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు చనిపోయారు. -
అమెరికాలో దుండగుడి కత్తిపోట్లు
అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం రాక్ఫోర్డ్లో ఓ దుండగుడు కత్తి దాడికి పాల్పడటంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. -
Pakistan: భారత్తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్