‘ఆ రోజు అణుబాంబు పేలినట్లు అనిపించింది’.. టోంగా ద్వీపవాసుల ప్రత్యక్ష అనుభవం
ఇటీవల దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ‘హుంగా టోంగా హుంగా హా అపై’ అగ్నిపర్వతం బద్ధలైన ఘటనలో సమీపంలోని టోంగా అనే ద్వీప దేశం అతలాకుతలమైన విషయం తెలిసిందే. సునామీ అలల ధాటికి టోంగా రాజధాని నుకుఅలోఫా ధ్వంసమైంది. ఇంటర్నెట్, టెలిఫోన్...
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ‘హుంగా టోంగా హుంగా హా అపై’ అగ్నిపర్వతం బద్ధలైన ఘటనలో సమీపంలోని టోంగా అనే ద్వీప దేశం అతలాకుతలమైన విషయం తెలిసిందే. సునామీ అలల ధాటికి టోంగా రాజధాని నుకుఅలోఫా ధ్వంసమైంది. ఇంటర్నెట్, టెలిఫోన్ తదితర సమాచార సేవలూ దెబ్బతిన్నాయి. అణుబాంబు పేలిందా? అన్నంత తీవ్రస్థాయిలో ఈ విస్ఫోటం సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న స్థానిక రెడ్క్రాస్ జనరల్ సెక్రెటరీ సీయోన్ తాజాగా తన భయంకర అనుభవాన్ని చెప్పుకొచ్చారు. శబ్దాల తీవ్రతకు మొత్తం ద్వీపం వణికినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందినట్లు తేలగా, నష్టాన్ని లెక్కించాల్సి ఉంది.
అగ్నిపర్వతం పేలి దాదాపు వారం రోజులు కావొస్తున్నా.. స్థానికంగా తీవ్ర పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎక్కడ చూసినా పెద్దఎత్తున బూడిద మేట వేయడంతో.. సహాయక చర్యల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. స్థానికులు తాగునీటి కొరతతో అల్లాడుతున్నారు. తాగునీటి కోసం ప్రధానంగా వర్షపు నీళ్లపై ఆధారపడే ఈ దేశంలో.. ప్రస్తుతం నీటి వనరులు బూడిద, ఉప్పునీళ్లతో కలుషితం అయ్యాయి. దీంతో ఇక్కట్లు ఎదురవుతున్నాయని ఐరాస సమన్వయకర్త జోనాథన్ వీచ్ ఓ వార్తాసంస్థకు తెలిపారు. ఈ క్రమంలో స్థానికంగా భూగర్భ జలాల కోసం నీటి పరీక్షలు చేపడుతున్నారు.
ప్రస్తుతం టోంగా విమానాశ్రయంలోని ప్రధాన రన్వేపై బూడిదను తొలగించారు. దీంతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుంచి సహాయ విమానాల రాకపోకలు సాగుతున్నాయి. నిత్యవసరాలు, నీళ్లు వంటివి సరఫరా చేస్తున్నాయి. అయితే, ఇతర దేశాల నుంచి సహాయ చర్యలు పెరుగుతున్న నేపథ్యంలో.. టోంగాలో ఒమిక్రాన్ వ్యాప్తి అవకాశాలపై ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు అగ్నిపర్వత పేలుడు ధాటికి సముద్ర గర్భంలోని సమాచార కేబుల్ వ్యవస్థ ధ్వంసం కావడంతో.. టోంగాలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. పరిస్థితుల పునరుద్ధరణకు వారాలు పట్టే అవకాశం ఉంది.
ఈ సమస్యపై స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. తన ‘స్టార్లింక్’ ప్రాజెక్ట్తో ముందుకొచ్చారు. టోంగాలో ఇంటర్నెట్ కోసం స్టార్లింక్ సేవల అవసరం ఉందో లేదో తెలియజేయాలంటూ స్థానికులను కోరారు. ఓ వార్తాసంస్థ కథనానికి సమాధానంగా.. ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. భూకక్ష్యలోకి వందలాది ఉపగ్రహాలను ప్రయోగించి.. వాటి సాయంతో ఇంటర్నెట్ సేవల కోసం ‘స్టార్లింక్ ప్రాజెక్ట్’ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
Anti-Israel Protests: గాజాలో పోరు సాగిస్తోన్న ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు తెలపడాన్ని పలువురు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్
విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సందర్భాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే వారి సొమ్ము వాపస్ చేసేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. -
బంగ్లాదేశ్ ఎదుగుదలను చూసి సిగ్గుపడుతున్నాం: షెహబాజ్
ఒకప్పుడు తమకు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి ఇపుడు సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు. -
అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం
గాజాలో అమెరికా-హమాస్ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. -
హైతీ ప్రధాని రాజీనామా
హింసాత్మక ఘటనలతో కుదేలైన కరీబియన్ దేశం హైతీలో ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆరియల్ హెన్రీ గురువారం ప్రకటించారు. -
బుర్కినాఫాసోలో సైన్యం ఊచకోత
మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బుర్కినాఫాసోలోని రెండు గ్రామాలపై ఆ దేశ సైన్యం విరుచుకుపడిందని ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థ గురువారం ప్రచురించిన ఓ నివేదికలో తెలిపింది. -
తక్షణం బందీలను విడుదల చేయండి
రఫాపై ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతున్న వేళ.. బందీలను విడుదల చేయాల్సిందిగా హమాస్కు అమెరికా సహా 18 దేశాలు విజ్ఞప్తి చేశాయి. -
కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె
కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. -
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. నైజీరియాలో 118 మంది ఖైదీల పరార్
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో వంద మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. -
భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్
భారత్లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. -
మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!
ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. -
అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు
చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. -
చిత్రవార్త
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?