KFC: కేఎఫ్సీపై మండిపడుతున్న చైనా!
ఫుడ్ సప్లయి రంగంలో కేఎఫ్సీకి ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేఎఫ్సీ చికెన్ను ఆహారప్రియులు చాలా ఇష్టంగా తింటుంటారు. అందుకే, ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థకు అనేక అవుట్లెట్లు ఉన్నాయి. కాగా.. ప్రస్తుతం చైనాలో కేఎఫ్సీకి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. తాజాగా
బీజింగ్: ఫుడ్ సప్లయ్ రంగంలో కేఎఫ్సీకి ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేఎఫ్సీ చికెన్ను ఆహారప్రియులు చాలా ఇష్టంగా తింటుంటారు.. అందుకే, ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థకు వేల సంఖ్యలో అవుట్లెట్లు ఉన్నాయి. కాగా.. ప్రస్తుతం చైనాలో కేఎఫ్సీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ సంస్థ తాజాగా ప్రవేశపెట్టిన ఆఫరే ఇందుకు కారణం.
పాప్ మార్ట్ అనే బొమ్మలు తయారీ సంస్థతో కలిసి కేఎఫ్సీ ఓ ఆఫర్ ప్రకటించింది. కేఎఫ్సీలో మీల్ ఆర్డర్ చేస్తే ఆర్డర్తోపాటు పాప్ మార్ట్కు చెందిన మిస్టరీ బాక్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆ మిస్టరీ బాక్స్లో పరిమితంగా తయారు చేసిన కొన్ని బొమ్మలు ఉంటాయి. చైనాలో కేఎఫ్సీని ప్రారంభించి 35ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ ఆఫర్ను తీసుకొచ్చినట్లు సంస్థ పేర్కొంది. ఇదే ఇప్పుడు చైనా వినియోగదారుల సంఘం (సీసీఏ)కి ఆగ్రహం తెప్పించింది. ఈ ఆఫర్ ఆహారం వృథాని ప్రోత్సహించే విధంగా ఉందని మండిపడుతోంది.
చైనాలో ఇప్పటికే ఆహారం వృథాపై పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. అందుకే, 2020లో ఆ దేశాధ్యక్షుడు షీ జిన్పింగ్ ‘క్లీన్ ప్లేట్’ ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రజలంతా ఆహారం మితంగా తినాలని, వృథా చేయకూడదని సూచించారు. అయితే, కేఎఫ్సీ ఆఫర్తో వచ్చే బొమ్మల కోసం ప్రజలు ఆకలి లేకపోయినా ‘మీల్’ను ఆర్డర్ చేసి.. బొమ్మని తీసుకొని ఆహారం పడేసే ప్రమాదం ఉందని సీసీఏ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఓ వ్యక్తి కేవలం బొమ్మలను సేకరించడానికి 100 సార్లు కేఎఫ్సీ ‘మీల్’ ఆర్డర్ ఇచ్చినట్లు వెల్లడించింది. ఇది ఇలాగే కొనసాగితే దేశంలో ఆహారం వృథా భారీగా జరగొచ్చని, వెంటనే కేఎఫ్సీని నిషేధించాలని సీఏఏ కోరుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్