Pakistan: పాక్ ముక్కుపిండి పరిహారం వసూలు చేసిన చైనా..!
చైనాలో దాసు హైడ్రోపవర్ డ్యామ్ వద్ద జరిగిన పేలుడుకు సంబంధించి నష్ట పరిహారాన్ని చైనా ముక్కుపిండి వసూలు చేస్తోంది. ఈ ఘటనలో 36 మంది చైనా కార్మికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
ఒక్కో ప్రాణానికి రూ.2.3 కోట్లు
ఇంటర్నెట్డెస్క్: పాక్-చైనాలు తమ బంధాన్ని ‘ఐరన్ బ్రదర్స్ బంధం’గా చెప్పుకొంటాయి. కానీ, సొమ్ము విషయానికి వస్తే మాత్రం చైనా ఎక్కడా తగ్గదు. పాక్లో దాసు హైడ్రోపవర్ డ్యామ్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడికి సంబంధించి నష్ట పరిహారాన్ని చైనా ముక్కుపిండి వసూలు చేస్తోంది. ఈ దాడిలో 36 మంది చైనా కార్మికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 2021 జులై 14వ తేదీన చైనా పాకిస్థాన్లో దాసు హైడ్రోపవర్ డ్యామ్ నిర్మాణ పనుల వద్ద భారీ ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో మొత్తం 36 మంది చైనా కార్మికులు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దీంతో బీజింగ్ రంగంలోకి దిగింది.. ప్రాణాలు కోల్పోయిన తమ కార్మికుల కుటుంబాలకు 38 మిలియన్ డాలర్ల (రూ.282 కోట్లు) పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. చైనాలో ఉగ్రదాడిలో మరణిస్తే అక్కడి ప్రభుత్వం ఇచ్చే పరిహారం కంటే ఇది దాదాపు రెట్టింపు మొత్తం.
అసలే పాకిస్థాన్లో పాలన నడపడానికే సొమ్ములు లేవు.. ఇక చైనాకు ఎక్కడి నుంచి తెచ్చిఇస్తుంది. ఈ మొత్తం ఇచ్చేందుకు పాక్ మొండికేసింది. దీంతో చైనా కాంట్రాక్టర్ దాసు డ్యామ్ పనులను అర్ధంతరంగా నిలిపివేశాడు. మళ్లీ పనులు మొదలుపెట్టాలంటే పలు డిమాండ్లు, నిబంధనలను పూర్తి చేయాలని మొండికేసి కూర్చున్నాడు.
ప్రపంచ బ్యాంక్ సహకారంతో దాసు హైడ్రోపవర్ డ్యామ్ను నిర్మిస్తున్నారు. ఇది చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)లో భాగం కాదు. కానీ, చైనా నిర్మాణరంగ సంస్థ జెగ్హుబా కంపెనీ నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం 2015లో ప్రారంభించారు. కానీ, ఆత్మాహుతి దాడి ఘటన తర్వాత పనులు నిలిపివేశారు.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్పై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ది ఎకనామిక్ కో-ఆర్డినేషన్ కమిటీ, పాక్ ఆర్థిక మంత్రి షౌకత్ తారిన్తో భేటీ అయింది. ఈ సందర్భంగా చైనా జాతీయులకు 11.6 మిలియన్ డాలర్లు (రూ.86.32 కోట్లు) చెల్లించాలని నిర్ణయం తీసుకొంది. మరోపక్క అదే చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ మీడియా ముందుకొచ్చి దాసు డ్యామ్ పనులు నిలిపివేతపై స్పందించారు. కాంట్రాక్టరు డిమాండ్లు చేస్తున్న విషయం తన దృష్టికి రాలేదని.. డ్యామ్ పనులు మళ్లీ మొదలయ్యాయని వెల్లడించారు.
తొలుత భారత్పై బురద చల్లే యత్నం..
గత జులైలో ఈ ఆత్మాహుతి దాడి జరిగిన సమయంలో పాక్ దీని తీవ్రతను తగ్గించి చూపేందుకు ప్రయత్నించింది. తొలుత ఇదో ప్రమాదంగా చిత్రీకరించింది. కానీ, చైనా సర్కారుకు చెందిన దర్యాప్తు బృందం నేరుగా ఘటనా స్థలాన్ని సందర్శించి.. ఆత్మాహుతి దాడిగా తేల్చింది. ఆ తర్వాత కూడా పాక్ మరోసారి తప్పించుకొనేందుకు ఈ దాడి బాధ్యతను భారత నిఘా సంస్థ ‘రా’పై మోపేందుకు ప్రయత్నించింది. ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి షామహమూద్ ఖురేషీ ఓ సందర్భంలో మాట్లాడుతూ భారత్, అఫ్గాన్ నిఘా వర్గాలు ఈ దాడి వెనుకాల ఉన్నాయని ఆరోపించారు. ఎటువంటి ఆధారాలను చూపించలేకపోయారు. ఆ తర్వాత పాకిస్థాన్ తాలిబన్ల హస్తం ఉన్నట్లు తేలింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
ఇండోనేసియాలో అగ్నిపర్వత భారీ విస్ఫోటం
ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటం చెందింది. సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మౌంట్ రువాంగ్లో బుధవారం విస్ఫోటం సంభవించింది. -
కెనడాలో అతిపెద్ద దోపీడీ కేసులో పురోగతి
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
కెన్యాలో మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లాతో పాటు మరో 9 మంది ఉన్నతాధికారులు మృతిచెందారు. -
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది. -
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు