Tonga: ‘ఆ పేలుడు శక్తి.. వందల హిరోషిమా అణుబాంబులకు సమానం’
ఇటీవల దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ‘హుంగా టోంగా హుంగా హా అపై’ అగ్నిపర్వతం బద్ధలైన విషయం తెలిసిందే. దీని ధాటికి సమీపంలోని టోంగా అనే ద్వీప దేశం అతలాకుతలమైంది. అక్కడ సమాచార వ్యవస్థ దెబ్బతినడంతో విధ్వంసం స్థాయి ఇంకా పూర్తిగా వెలుగులోకి...
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ‘హుంగా టోంగా హుంగా హా అపై’ అగ్నిపర్వతం బద్ధలైన విషయం తెలిసిందే. దీని ధాటికి సమీపంలోని టోంగా అనే ద్వీప దేశం అతలాకుతలమైంది. అక్కడ సమాచార వ్యవస్థ దెబ్బతినడంతో విధ్వంసం స్థాయి ఇంకా పూర్తిగా వెలుగులోకి రాలేదు. ఇదిలా ఉండగా, ఈ అగ్నిపర్వత విస్ఫోటం.. జపాన్లోని హిరోషిమాపై పడిన అణుబాంబు కంటే వందల రెట్లు ఎక్కువ శక్తిని విడుదల చేసినట్లు నాసా శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించారు. అగ్నిపర్వతం పేలిన సమయంలో విడుదలైన శక్తి.. 5- 30 మెగాటన్నుల టీఎన్టీ మధ్యలో ఉంటుందని భావిస్తున్నట్లు నాసా శాస్త్రవేత్త జిమ్ గార్విన్ ఒక ప్రకటనలో తెలిపారు. 1945లో హిరోషిమాపై వేసిన అణుబాంబు పేలుడు శక్తి (దాదాపు 15 కిలో టన్నుల టీఎన్టీ)కంటే ఇది వందల రెట్లు ఎక్కువని చెప్పారు.
అగ్నిపర్వతం బద్ధలైనప్పుడు వాతావరణంలో 40 కిలోమీటర్ల మేర బూడిద, పొగ వ్యాపించినట్లు నాసా ఎర్త్ అబ్జర్వేటరీ తెలిపింది. ఈ పేలుడు తీవ్రతకు టోంగా ద్వీపంలోని 65 కిలోమీటర్ల మేర ప్రాంతం తుడిచిపెట్టుకుపోయినట్లు చెప్పింది. ‘ఈ ఘటన.. టోంగాను విషపూరిత బూడిదతో కప్పేసింది. నీటి వనరులను కలుషితం చేసింది. పంటలు నాశనమయ్యాయి. రెండు గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి’ అని వెల్లడించింది. స్థానికులు ఇప్పుడిప్పుడే ఆ షాక్ నుంచి కోలుకుంటున్నట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది. హానికర బూడిద కారణంగా.. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు జపాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా రక్షణ దళాలు.. టోంగాకు అత్యవసర సహాయ సామగ్రిని చేరవేయడంలో నిమగ్నమయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?