Trump: అధికారం కోసం ట్రంప్ అంతకు తెగించారా?
అధ్యక్ష పదవిలో కొనసాగడం కోసం ట్రంప్ ఎంత దూరం వెళ్లారో నిరూపించే ఆసక్తికర ఆధారం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది....
వాషింగ్టన్: అధికారాన్ని అట్టిపెట్టుకోవడం కోసం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏడాది క్రితం ఎంత హంగామా సృష్టించారో గుర్తుంది కదా! తాజాగా అధ్యక్ష పదవిలో కొనసాగడం కోసం ఆయన ఎంత దూరం వెళ్లారో నిరూపించే ఆసక్తికర ఆధారం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఓటింగ్ యంత్రాలను స్వాధీనం చేసుకోమని ఆదేశిస్తూ రక్షణశాఖ సెక్రటరీకి ఓ లేఖ రాయడానికి ఆయన సిద్ధమయ్యారట. దానికి సంబంధించిన ముసాయిదాను కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ, చివరకు దాన్ని అధికారికంగా జారీ చేయలేకపోయారని వెల్లడైంది.
ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ ఓటమి ఖాయమైన తర్వాత ఆయన మద్దతుదారులు జనవరి 6న క్యాపిటల్ హిల్ భవనంపై దాడికి దిగిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరుపుతున్న హౌస్ కమిటీకి తాజాగా ఈ ముసాయిదా లేఖ లభ్యమైంది. అయితే, దాన్ని ఎవరు రూపొందించారన్నది మాత్రం ఇంత వరకు తెలియరాలేదు. ట్రంప్ విచారణ నుంచి తప్పించుకోలేరంటూ ఇటీవలే అక్కడి సుప్రీంకోర్టు స్పష్టం చేసిన తరుణంలో ఈ లేఖ బయటకు రావడం గమనార్హం.
అమెరికా ప్రజల తీర్పునకు వ్యతిరేకంగా శ్వేతసౌధాన్ని అట్టిపెట్టుకోవడం కోసం ట్రంప్, ఆయన సన్నిహిత వర్గాలు ఎంత వరకు తెగించాయో ఈ లేఖ నిరూపిస్తోందని బైడెన్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ముసాయిదా లేఖలో పేర్కొన్నట్లు రక్షణశాఖ సెక్రటరీ ఓటింగ్ యంత్రాలను స్వాధీనం చేసుకొని ఉంటే ఫలితాల నిర్ధారణ మరో 60 రోజులు ఆలస్యమయ్యేది. తద్వారా ఫిబ్రవరి వరకు ట్రంప్ అధికారంలో ఉండేందుకు అవకాశం దొరికేది. నిబంధనల ప్రకారం.. రిగ్గింగ్ జరిగినట్లు ఆధారాలు ఉంటే అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఫలితాలను విశ్లేషించి తుది నివేదికను సమర్పించడానికి రక్షణ శాఖకు 60 రోజుల సమయం ఉంటుంది. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని.. ఓటింగ్ యంత్రాల్లో అవకతవకలు ఉన్నాయని ఆరోపిస్తూ ట్రంప్ తన ఆదేశాల్ని జారీ చేయాలని విఫలయత్నం చేశారు.
ఫలితాలు వెలువడుతున్న సమయంలో ఓటింగ్ యంత్రాలను స్వాధీనం చేసుకోవాలన్న వాదనను అప్పటి ట్రంప్ బృందంలో ఉన్న న్యాయవాది సిడ్నీ పావెల్ బలంగా వినిపించారు. సరిగ్గా అదే సమయంలో ఈ లేఖ కూడా రాసినట్లు ఉండడంతో బహుశా ఆమే దాన్ని రూపొందించి ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ఎన్నికల్లో అంతర్జాతీయ శక్తుల జోక్యం కూడా ఉన్నట్లు లేఖలో ఆరోపించడం గమనార్హం. ఓటింగ్ యంత్రాలను తయారు చేసిన ‘డొమీనియన్ ఓటింగ్ సిస్టమ్స్’ అనే కంపెనీని విదేశీ శక్తులు నియంత్రిస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఫలితాలు బైడెన్కు అనుకూలంగా మార్చేందుకు ఓటింగ్ యంత్రాల్లో డొమీనియన్ మార్పులు చేసిందని ఆరోపించారు. ఏదేమైనప్పటికీ అధికారం కోసం ట్రంప్ వేసిన ఏ పాచికలూ పారలేదు. ప్రజల తీర్పు మేరకు చివరకు బైడెన్ అధికార పగ్గాలు స్వీకరించారు. సొంత పార్టీ సభ్యుల నుంచి కూడా వ్యతిరేకత రావడంతో చివరకు ట్రంప్ పరాభవంతో ఓటమిని అంగీకరించక తప్పలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM