Sperm Donor: 129మంది పిల్లలకు తండ్రి.. ఇంకా సంతానం కావాలట!
సాధారణంగా ఎవరికైనా ఇద్దరు లేదా ముగ్గురు సంతానం ఉంటారు. ఐదారుగురు పిల్లలు ఉన్నవారినీ చూశాం. అయితే, ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 138 పిల్లలకు తండ్రి అయ్యాడు. ఇది ఎలా సాధ్యమైంది అంటారా.. వీర్యం దానం చేయడం ద్వారా.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత కాలంలో దంపతులు ఇద్దరు లేదా ముగ్గురు సంతానాన్ని కోరుకుంటున్నారు. ఐదారుగురు పిల్లలు ఉన్నవారినీ చూశాం. అయితే, ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 129 పిల్లలకు తండ్రి అయ్యాడు. ఇది ఎలా సాధ్యమైంది అంటారా.. వీర్యం దానం చేయడం ద్వారా. పాశ్చాత్య దేశాల్లో వీర్యదానం సంస్కృతి కొత్తేమీ కాదు. అందుకు అక్కడి చట్టాలు కూడా అనుమతిస్తాయి. యూకేకు చెందిన క్లైవ్ జోన్స్ (వయసు 66 సంవత్సరాలు) వీర్యదానం చేయడం ద్వారా 129 పిల్లలకు తండ్రి అయ్యాడు. మరో తొమ్మిది మంది త్వరలో పుట్టబోతున్నారు. తనకు 58 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి వీర్యం దానం చేస్తున్నట్టు తెలిపాడు. స్పెర్మ్ ఇచ్చేందుకు డబ్బులు కూడా తీసుకోవడం లేదని వెల్లడించాడు. ప్రస్తుతం ప్రపంచంలో తానే ఎక్కువమందికి వీర్యదానం చేసిన వ్యక్తిగా ఉన్నట్లు తెలిపారు. మరొకిన్నేళ్లపాటు వీర్యదానం చేస్తానని, 150 మందికి తండ్రి అయిన తర్వాత వీర్యదానం చేయనని క్లైవ్ పేర్కొన్నాడు.
అయితే, క్లైవ్ అధికారికంగా స్పెర్మ్ డోనర్ కాదు. బ్రిటన్లో స్పెర్మ్ డోనర్ గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు ఉండాలి. ఈ కారణంగా ఫేస్బుక్ ద్వారా కస్టమర్లతో కనెక్ట్ అయి ఉచితంగా వీర్యదానం చేస్తున్నాడు. బ్రిటన్లో చాలా క్లినిక్లు వీర్యాన్ని అమ్ముతున్నట్లు తెలిపారు. ఒకరికి ఆనందాన్ని ఇవ్వడం, వారికి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేయడం ద్వారా తాను సంతోషపడుతున్నానని క్లైవ్ చెబుతున్నాడు. 10 సంవత్సరాల క్రితం వార్తాపత్రికలో వచ్చిన ఒక కథనాన్ని చదివిన తరువాత పిల్లలు లేని వ్యక్తులు ఎంత మానసిక వేదనను అనుభవిస్తారో తెలిసి ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించాడు. అయితే, యూకే హ్యూమన్ ఫర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియాలజీ అథారిటీ.. క్లైవ్కు హెచ్చరిక జారీ చేసింది. సాధారణంగా బ్రిటన్లో స్పెర్మ్ డొనేషన్, కొనుగోలు చేయడం లైసెన్స్ పొందిన క్లినిక్ ద్వారా మాత్రమే చేయాలి. క్లైవ్ వీటిని పాటించకపోవడం వల్ల పలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని