MI vs GT: ఉగ్ర సూర్య.. ఐపీఎల్లో తొలి శతకం
ఈ సీజన్లో ఆలస్యంగా పుంజుకుని 200 లక్ష్యాలను ఛేదించడం అలవాటుగా మార్చుకున్న ముంబయి.. ఈసారి మొదట బ్యాటింగ్ చేస్తూ ఆ మార్కును దాటింది. శుక్రవారం సూర్యకుమార్ యాదవ్ (103 నాటౌట్; 49 బంతుల్లో 11×4, 6×6) మెరుపులతో 5 వికెట్లకు 218 పరుగుల భారీ స్కోరు చేసిన ముంబయి.. గుజరాత్ను 191/8కు కట్టడి చేసింది.